టాలీవుడ్ లో ఎందరో టాప్ హీరోలకు బ్లాక్ బష్టర్ హిట్స్ ఇచ్చిన వి.వి.వినాయక్ ఇప్పుడు వరస ఫ్లాప్ లతో ఉన్నాడు. ఒకప్పుడు మాస్ సినిమాలకు చిరునామాగా కొనసాగిన వినాయక్ తో ఒక మాస్ సినిమా చేయడానికి ఏహీరో ముందుకు రావడం లేదు. ఇలాంటి పరిస్థితులలో బెల్లంకొండ సురేష్ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ తాను వినాయక్ ను హీరోగా పెట్టి 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఒక సినిమా తీయబోతున్నాను అంటూ ప్రకటన చేసి అందరి మైండ్ బ్లాంక్ చేసాడు.


ప్రస్తుతం వినాయక్ బెల్లంకొండ శ్రీను ను హీరోగా చేసి రాజమౌళి గతంలో తీసిన బ్లాక్ బష్టర్ మూవీ ‘ఛత్రపతి’ ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆమధ్య దిల్ రాజ్ వినాయక్ ను హీరోగా పెట్టి ఒక సినిమా మొదలుపెట్టి మధ్యలో ఆపేసాడు దానికి కారణాలు తెలియవు. ఈ పరిస్థితుల మధ్య వినాయక్ తో 500 కోట్ల మూవీ ఏమిటి అంటూ చాలామంది షాక్ అవుతున్నారు.


అయితే మరికొందరు మాత్రం ఈవిషయమై మరొక విధంగా స్పందిస్తున్నారు. బెల్లంకొండ తన కొడుకు హిందీ సినిమాకు పాజిటివ్ గా చెప్పుకోవడం కోసమే ఇలా మాట్లాడి ఉంటాడని కామెంట్స్ చేస్తున్నారు. గతంలో వివి.వినాయక్ బాలకృష్ణ ల కాంబినేషన్ లో విడుదలైన ‘చెన్నకేశవరెడ్డి’ మూవీని ఇప్పుడు మళ్ళీ భారీ స్థాయిలో రీ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.


మహేష్ ‘పోకిరి’ పవన్ ‘జల్సా’ మూవీలు రీ రిలీజ్ చేసినప్పుడు మహేష్ పవన్ అభిమానులు ధియేటర్లలో చేసిన హంగామాను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు అలాంటి హంగామా ను రీ క్రియేట్ చేయాలని బాలయ్య అభిమానులు ‘చెన్నకేశవరెడ్డి’ రీ రిలీజ్ తో మరో కొత్త ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాతో బాలయ్య అభిమానుల స్టామినాను అందరికీ చూపించాలని బాలయ్య అభిమానులు చూపెడుతున్న ఉత్సాహం ఎంతవరకు విజయవంతం అవుతుందో చూడాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: