మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా విడుదలైన ప్రతి చోట కూడా హీట్ టాక్ తో దూసుకుపోతోంది. ఇక అన్ని అంచనాలను మించిపోయి కలెక్షన్ల పరంగా కూడా బాగానే ఆకట్టుకుంటోంది .నిన్నటి రోజున మరింత కలెక్షన్లు రాబట్టినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక యు ఎస్ ఏ లో బుకింగ్స్ కూడా బాగున్నాయని..కామెడీ క్లిక్ అయిందని.. తెలుగు సినిమా బాగా ఆడడాన్ని ఎవరు ఆపలేరు అంటూ అక్కడ కొన్ని అధికారిక వెబ్సైట్లో ఈ విషయాన్ని వాస్తవంగా నిర్ధారించినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.



ఇక చిరంజీవి, రవితేజ కలిసి ఈ చిత్రంలో ఒక అద్భుతమైన నటనను ప్రదర్శించారని పలువురు అభిమానులు సైతం చాలా ఆనందంగా తెలియజేస్తున్నారు. వాస్తవానికి బాలయ్య సినిమా చిరంజీవి సినిమాల మధ్య గట్టి పోటీ నిలబడిందని చెప్పవచ్చు. ఇలాంటి సమయంలోనే కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తూ బాలయ్య సినిమాని హైలైట్ చేయడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో యూ ఎస్ ఏ లో కొన్ని అధికారిక వెబ్సైట్ల ద్వారా ఈ విషయాన్ని విమర్శించడం జరుగుతోంది. ఇక కలెక్షన్ల పరంగా కూడా చిరంజీవి సినిమా బాగానే రాణిస్తున్నట్లు సమాచారం. శృతిహాసన్ కూడా అద్భుతమైన నటన ప్రదర్శించింది. ఇక ప్రకాష్ రాజ్ శ్రీనివాసరెడ్డి, షకలక శంకర్ తదితరులు తమ కామెడీ తో బాగా ఆకట్టుకున్నారు.


ఇక movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు మొదటి రోజు చిరంజీవి చిత్రానికి రూ.20 కోట్లు వస్తే చాలనుకోగా రూ.30 కోట్లకు పైగా వచ్చినట్లు తెలియజేశారు. మరి రాబోయే రోజుల్లో మరింత కలెక్షన్లను సాధించి సినిమా ఎన్ని కోట్లు లాభాన్ని నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు అందిస్తుందో తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం చిరంజీవి చేతుల భోళా శంకర్ సినిమా మాత్రమే ఉన్నది ఈ చిత్రంలో హీరోయిన్గా తమన్నా నటిస్తోంది. చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ కూడా నటిస్తున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: