టాలీవుడ్ స్టార్ హీరో ఐనా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆస్కార్ వేడుకలు ముగించుకొని మరల తన ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్యాడు.ప్రెసెంట్ ఆయన శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.

మొదటగా ఈ ఏడాది లోనే చరణ్, శంకర్ కాంబో సినిమా ను విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు భావించాడు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. మరీ ఇంత ఆలస్యం అవ్వడానికి కారణం దర్శకుడు శంకర్ మరో వైపు కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమా ను చేస్తున్నాడు. చరణ్ తో సినిమా ను మొదలు పెట్టిన తర్వాత ఇండియన్ 2 ను మళ్లీ మొదలు పెట్టాల్సి వచ్చింది. దాంతో రెండు సినిమా లను బ్యాలన్స్ చేస్తూ దర్శకుడు శంకర్ సినిమా లు చేస్తూ వస్తున్నాడు.

చరణ్ సినిమా మొదట వస్తుందని అంతా ఆశించారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇండియన్ 2 సినిమా మరీ ఆలస్యం అవ్వడం లేదట. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఇండియన్ 2 ను ఇదే ఏడాది లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావిస్తున్నారు. అతి త్వరలోనే ఇండియన్ 2 యొక్క విడుదల తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. శంకర్ గతంలో ఇండియన్ సినిమా చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కనుక ఇండియన్ 2 అంతకు మించి అన్నట్లుగా ఉంటుందనే నమ్మకం ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా మంచి మార్కెట్ ఉన్న శంకర్ మరియు కమల్ హాసన్ ల మూవీ భారీ గా విడుదల అవ్వబోతుంది. ఆ తర్వాత చరణ్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు శంకర్ వస్తాడు. ఈ సినిమా లో చరణ్ కి జోడీగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే.

ఐతే చూడాలి మరీ శంకర్ రెండు భారీ బడ్జెట్ మూవీస్ ను ఒకేసారి హేండిల్డ్ చేయడం పై సక్సెస్ అవుతాడా లేదా అని చాలామంది అభిమానులు ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: