ప్రముఖ హీరోయిన్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రేణూ దేశాయ్ పేరు ఎత్తితే చాలు ఎక్కువగా పవన్ కళ్యాణ్ తో పెళ్లి, విడాకులు, ట్రోలింగ్సే ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఇకపోతే తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని కట్టుకున్న భర్త మాత్రమే కాదు కన్న తల్లిదండ్రులు కూడా నరకం చూపించారు అంటూ ఒక షాకింగ్ కామెంట్ చేయడం ఇప్పుడు మరింత వైరల్ గా మారింది. తాజాగా రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా లో కీలకపాత్ర పోషిస్తున్న ఈమె.. సినిమా అక్టోబర్ 20వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొని ఈ విధంగా వెల్లడించింది.

రేణు దేశాయ్ మాట్లాడుతూ.. పెళ్లి తర్వాత 20 సంవత్సరాలు నా జీవితంలో ఎలా ఉన్నానో మీ అందరికీ తెలుసు. అయితే పెళ్లికి ముందు కూడా నేను అంతే నరకం అనుభవించాను. సమాజంలో లింగ వివక్షత ఎక్కువగా ఉంటుంది. అయితే నా విషయంలో కూడా ఆ వివక్షత నా తల్లిదండ్రులు చూపించారు. కొడుకు పుడతారు అనుకున్న సమయంలో నేను పుట్టేసరికి మా నాన్న నన్ను చూడడానికి మూడు రోజుల వరకు రాలేదట. ఈ విషయం మా అమ్మ చెప్పిన ప్రతిసారి నాకు మరింత బాధ కలుగుతుంది. తమ్ముడి ప్లేసులో నేను పుట్టేసరికి అసలు పట్టించుకోలేదు. 19 సంవత్సరాల వయసులో అమ్మ ఎందుకు నాకు తల్లి ప్రేమ పంచ లేదు అని అడగ్గా ఆమె కూడా ఏమీ మాట్లాడలేదు.

 అలా తల్లిదండ్రులు ఉండి కూడా వారి ప్రేమను నేను నోచుకోలేదు.ఒక తల్లికి బిడ్డ అయినా కొడుకైన ఇద్దరు సమానమే.. కానీ మా అమ్మ నన్ను అలా చూడలేదు.. అందుకే నేను ఆ భేదాన్ని చూపించకుండా నా పిల్లలు ఇద్దరికీ కావలసిన పూర్తి తల్లి ప్రేమను అందిస్తున్నాను అంటూ ఎమోషనల్ అయింది రేణు దేశాయ్. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: