సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు రైటర్లుగా పని చేసిన వారు ఆ తర్వాత కాలంలో ఏకంగా డైరెక్టర్లు అవతారమెత్తి సూపర్ సక్సెస్ అయిన వారు చాలామంది ఉన్నారు. అదే సమయంలో ఇక రైటర్ నుంచి డైరెక్టర్ అయి చేతులు కాల్చుకున్న వారు కూడా ఉన్నారు అని చెప్పాలి. అయితే రైటర్ గా తన సత్తా ఏంటో నిరూపించి ఆ తర్వాత దర్శకత్వంలోనూ సూపర్ సక్సెస్ అయిన వారిలో త్రివిక్రమ్ మొదటి స్థానంలో ఉంటారు అని చెప్పాలి. ఏకంగా ఆయన తన రైటింగ్తో దర్శకత్వంతో ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండు సృష్టించారు. ఇప్పటికీ స్టార్ డైరెక్టర్ గా హవా నడిపిస్తూ ఉన్నారు.



 ఇక త్రివిక్రమ్ తర్వాత రైటర్ నుంచి డైరెక్టర్ గా మారిన వారిలో కొరటాలు శివ రెండవ స్థానంలో ఉంటారు అని చెప్పాలి. కొరటాల శివ ముందుగా రైటర్ గా పనిచేసి ఇతర దర్శకులకు ఈ కథలను అందించేవాడు. కానీ ఆ తర్వాత దర్శకుడిగా అవతారం ఎత్తాడు. అయితే అతని దర్శకుడుగా రావడానికి కారణం కూడా లేకపోలేదు. రైటర్ గా ఉన్నప్పుడు చాలామంది తనకు అన్యాయం చేశారనే ఉద్దేశంతో దర్శకుడిగా మారినట్లు గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఏకంగా ఒక దర్శకుడు తన దగ్గర నుంచి కథలను నొక్కేసి కనీసం తన పేరును కూడా వేయకుండా మోసం  చేశాడట.


 ఆద ర్శకుడు ఎవరో కాదు గతంలో కొరటాల శివ స్నేహితుడిగా ఉన్న బోయపాటి నేనట. అప్పట్లో కొరటాల శివ కథలతోనే బోయపాటి ఎన్నో సినిమాలు చేశాడు అంటూ ఇండస్ట్రీలో కొన్ని వార్తలు వచ్చాయి. ఇక ఇలా బోయపాటి తన కథలను నొక్కేసి తనకు అన్యాయం చేశాడు అన్న కారణంతోనే ఇక కొరటాల ప్రభాస్ తో మిర్చి సినిమా చేసి కసితో హిట్టు కొట్టాడు అంటూ వార్తలు వచ్చాయి. బోయపాటి తీసిన భద్ర అలాగే సింహా సినిమాల కొరటాల స్టోరీలే అంటూ ఎన్నో వార్తలు మీదికి వచ్చాయి. మరి ఇందులో ఏది నిజం అన్నది మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియదు

మరింత సమాచారం తెలుసుకోండి: