ప్రస్తుతం సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న సమంత గురించి.. కొత్తగా సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఏ మాయ చేసావే అనే సినిమాతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఇక మొదటి సినిమాతోనే ప్రేక్షకులు అందరిని కూడా మాయ చేసేసింది. ఇక ఆ తర్వాత తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా కూడా అవకాశాలను దక్కించుకుంది. ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్న సమయంలోనే.. అక్కినేని హీరో నాగచైతన్యను పెళ్లి చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.


 అయితే ఈ ఇద్దరు క్యూట్ జోడీగా ఉన్నారు అని అందరూ అనుకుంటున్న సమయంలో.. ఊహించని విధంగా విడాకులు తీసుకుని వేరుపడ్డారు. అయితే విడాకుల తర్వాత సమంత ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది. విడాకుల తర్వాత మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది సమంత. దీంతో సినిమాలకు దూరమైపోయింది. ఎన్నో రోజులపాటు చికిత్స తీసుకొని ఇప్పుడిప్పుడే ఈ వ్యాధి నుంచి బయటపడింది. మళ్ళీ కెరియర్ పై దృష్టి సారించింది అని చెప్పాలి. సెలబ్రిటీలు ఏదైనా వ్యాధి బారిన పడితే దాని గురించి బయట చెప్పుకోవడానికి పెద్దగా ఇష్టపడరు.


 తమ పర్సనల్ ఆరోగ్య సమస్యల గురించి అభిమానులకు తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు అని చెప్పాలి. కానీ సమంత మాత్రం అయోసైటీస్ అనే వ్యాధి గురించి అందరికీ చెప్పేసింది. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత.. ఇలా తన వ్యాధి గురించి అందరికీ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బలవంతంగా మయోసైటీస్ సమస్యను పబ్లిక్ కి చెప్పాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చింది. ఆ సమయంలో నా సినిమా విడుదల కావలసి ఉంది. కానీ నా ఆరోగ్యం అస్సలు బాగాలేదు. ప్రమోషన్స్  చేయాల్సిన అవసరం ఉండడంతో ఇక మాయోసైటీస్ గురించి బయటకు చెప్పాల్సిన అవసరం వచ్చింది అంటూ సమంత చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: