చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్) హోరెత్తిపోయింది. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) - సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరిగిన మ్యాచ్‌తో స్టేడియం నిండిపోయింది. అభిమానులతో, తారలతో ఆ రాత్రంతా అదిరిపోయింది. కానీ కొందరికి మాత్రం ఈ మ్యాచ్ ఫలితం ఆనందం కంటే బాధనే మిగిల్చింది.

సీఎస్‌కే టీమ్‌కి సపోర్ట్ చేయడానికి వచ్చిన నటి శృతి హాసన్.. మ్యాచ్ ఓడిపోయాక ఎమోషనల్ అయ్యింది. కన్నీళ్లు పెట్టుకున్న ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె తన స్నేహితులతో కలిసి మ్యాచ్ ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ఎంఎస్ ధోని బ్యాటింగ్‌కి వస్తుంటే చాలా సంతోషపడింది. నవ్వుతూ తన ఫోన్‌లో ధోనీ ఫొటోలు కూడా తీసింది. కానీ మ్యాచ్ చివరికి వచ్చేసరికి ఫలితం చూసి నిరాశ చెందింది.

సీఎస్‌కే అభిమానులు గెలుపు ఆశించినా స్టేడియం మాత్రం తారల సందడితో మెరిసిపోయింది. మ్యాచ్‌కి అతి పెద్ద హైలైట్ తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్. 'తల'గా ఫేమస్ అయిన అజిత్ మ్యాచ్‌కు రావడం అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపింది. ఆయన అభిమానులకు అభివాదం చేస్తూ నవ్వుతూ కనిపించగా.. ప్రేక్షకుల కేకలతో స్టేడియం దద్దరిల్లింది. ఆయన ప్రేమను ఆస్వాదిస్తూ కనిపించారు.

అజిత్‌తో పాటు ఆయన భార్య, మాజీ నటి షాలిని, కూతురు అనౌష్క కూడా ఉన్నారు. అనుష్క, ఆమె మామయ్య మధ్య ఓ మధురమైన క్షణం కెమెరాలో చిక్కి వెంటనే వైరల్ అయ్యింది. కుటుంబంతో కలిసి అజిత్ స్టేడియానికి రావడం అక్కడంతా ఓ వెచ్చని, సంతోషకరమైన వాతావరణాన్ని తీసుకొచ్చింది.

ప్రేక్షకుల గ్యాలరీలో ఎంఎస్ ధోనీ భార్య సాక్షి ధోని కూడా కనిపించింది. తెల్లటి పూల డిజైన్ దుస్తుల్లో వచ్చిన ఆమె సీఎస్‌కేను ఉత్సాహంగా సపోర్ట్ చేసింది. శివమ్ దూబే బౌండరీ కొట్టినప్పుడు నవ్వుతూ చప్పట్లు కొట్టింది. టీమ్ పట్ల తన మద్దతును గట్టిగా చూపించింది. సీఎస్‌కే మ్యాచ్ ఓడిపోయినా చెపాక్‌లో ఆ రాత్రంతా ఉత్సాహం, తారల మెరుపులు, మర్చిపోలేని క్షణాలతో నిండిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: