మంచు విష్ణు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం కన్నప్ప. భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య అయితే ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ ఒక వర్గం ఆడియన్స్ ను ఆకట్టుకోలేదని చెప్పాలి. ఇకపోతే ప్రభాస్, మోహన్ లాల్ , అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి భారీతారాగణం ఈ సినిమాలో నటించారు. ముఖ్యంగా ఈ సినిమా ప్రభాస్ కోసమే చూసామని చాలామంది కామెంట్లు చేసిన విషయం తెలిసింది

ఇదిలా ఉండగా ఈ సినిమాలో మంచు విష్ణు తన పిల్లలు ముగ్గురిని నటింప చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అరియానా,  వివియానా, అవ్రామ్ ముగ్గురు కూడా ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు
. ఈ సినిమా లో వీరిని అనవసరంగా పెట్టారు అని కొంతమంది కామెంట్లు చేస్తున్నార.  నిజానికి వీరందరినీ కావాలనే ఈ సినిమాలో పెట్టారని, వీరి పాత్రలకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదని కూడా సమాచారం. ముఖ్యంగా మంచు విష్ణు తన సినిమా ద్వారా తన పిల్లల్ని పరిచయం చేయాలని చూశాడు. కానీ ఆ పాత్రలు ఆ పిల్లల కెరియర్ పై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయి అనే విషయాన్ని విష్ణు గమనించలేకపోయాడా అంటూ కొంతమంది విమర్శలు గుప్పిస్తున్నారు.

అంతేకాదు మంచు విష్ణు చేసిన పనికి ఇప్పుడు పిల్లలు ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తోందంటూ కూడా కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. ఇక కన్నప్ప సినిమా విషయానికి వస్తే.. ఎట్టకేలకు ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది . ఈ సినిమా ఈ సినిమాపై మంచు మనోజ్ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దీనికి తోడు  సినిమాకు సంబంధించి పలు విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి ఈ సినిమా ద్వారా పిల్లలు కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. మరి ఈ సినిమా వీరికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: