తెలుగు సినీ పరిశ్రమ ఎప్పటిలానే పలు సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న సమయంలో ఇప్పుడు సమ్మె రూపంలో మరో పెద్ద సమస్య తలెత్తింది. వేతనాల పెంపు డిమాండ్ చేస్తూ సినీ కార్మికులు సమ్మెకు దిగడం, ఇప్పటికే అనేక ప్రొడక్షన్లలో ఉన్న పనులు పూర్తిగా నిలిచిపోయిన‌ట్ల‌య్యింది. ఈ సమ్మె ఎంతకాలం కొనసాగుతుందో స్పష్టత లేకపోవడం నిర్మాతలు, దర్శకులు, నటీనటులు అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతున్న ప్రధాన సినిమాలు చూస్తే ప్రభాస్ రాజాసాబ్, రామ్ చరణ్ పెద్ది, బాలకృష్ణ అఖండ 2, చిరంజీవి - అనిల్ రావిపూడి సినిమా, నాని ప్యారడైజ్, రవితేజ - కిశోర్ తిరుమల కాంబినేషన్ మూవీ, సాయి తేజ్ సంబరాల ఏటిగట్టు, అడివి శేష్ డకాయిట్ ఇవన్నీ నిర్దిష్ట డేట్‌లను లాక్ చేసుకొని షెడ్యూల్ ప్రకారం పక్కాగా షూటింగులు జరుపుతున్న ప్రాజెక్టులు. సమ్మె వల్ల షూటింగులు ఆగిపోవడంతో ఈ సినిమాల రిలీజ్ బాగా ఆల‌స్యం కానుంది.


షెడ్యూల్‌ ప్రకారం షూటింగ్ జరగకపోతే నటీనటుల డేట్లు పూర్తిగా మారిపోతాయి. ఒక స్టార్ హీరో లేదా హీరోయిన్ డేట్స్ మారితే మొత్తం షెడ్యూల్‌ని రీ అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. టెక్నీషియన్ల అందుబాటు చూసుకోవడం, మిగిలిన క్రాఫ్ట్ వర్కర్లను సమన్వయం చేయడం లాంటి ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ఈ ఆలస్యం కారణంగా బడ్జెట్ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో క్వాలిటీకి పెద్ద పీట వేస్తున్న తరుణంలో, సమ్మె వల్ల కోల్పోయే సమయం పోస్ట్ ప్రొడక్షన్ పనులపై ప్ర‌భావం చూపిస్తుంది.


ఈ బంద్ వల్ల ఆర్థికపరమైన నష్టమే కాకుండా, రిలీజ్ డేట్లు తప్పిపోవడం, డిస్ట్రిబ్యూషన్ ప్లాన్లు మారిపోవడం, ప్రమోషన్లపై ప్రతికూల ప్రభావం పడటం వంటి పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాకుండా, పండుగ సీజన్లు లేదా సెలవుల కాలాలను టార్గెట్ చేసిన సినిమాలు మిస్ అయితే కలెక్షన్లపై కూడా నేరుగా ప్రభావం పడుతుంది. ఏదేమైనా నిర్మాతలు, సినీ కార్మికుల ఫెడరేషన్ ప్రతినిధులు పరస్పర సమస్యలను అర్థం చేసుకొని చర్చల ద్వారా త్వ‌ర‌గా ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోక‌పోతే ఇండ‌స్ట్రీకి పెద్ద న‌ష్టం క‌లిగే ప్ర‌మాదం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: