మలయాళం స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న పృథ్విరాజ్ సుకుమారం గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు . ప్రజెంట్ ఈ హీరో వరస సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతున్నాడు . ఓవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి విభిన్న పాత్రలలో ప్రేక్షకులను అలరిస్తున్నాడు ‌. ఇక ఇటీవలే ఎల్ టు ఎంపురాన్ మూవీ తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు ‌. ప్రజెంట్ పలు సినిమాలలో గెస్ట్ రోల్స్ చేస్తున్నాడు పృథ్వీరాజ్ . ఇక ఈ క్రమంలో నేడు పృధ్విరాజ్ సుకుమారం 43వ పుట్టినరోజు కావడంతో కొత్త ప్రాజెక్టులను ప్రకటించి అందరికీ సర్ప్రైజ్ ఇస్తున్నాడు .


ఆయనకు విషెస్ తెలుపుతూ మూవీ మేకర్స్ టైటిల్ గ్లింస్ ను రిలీజ్ చేస్తున్నారు కూడా . ఇక ఇందులో పృధ్విరాజ్ సుకుమారన్ అమీర్ అలీగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది . ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన గేమ్స్ ప్రేక్షకులలో భారీ హైట్ ను క్రియేట్ చేస్తున్నాయి ‌. ఖలీఫా ది బ్లడ్ లైన్ టైటిల్ తో రాబోతున్న ఈ మూవీ ని గోల్డ్ స్మిల్లింగ్ నేపథ్యంలో రూపొందిస్తున్నారు . ఇందులో విద్యుత్ మరియు కృతి శెట్టి, ప్రియంబద కృష్ణన్ నటిస్తున్నారు . ఇక ఈ మూవీకు వైశాఖ్ దర్శకత్వం వహిస్తున్నారు .


పృధ్విరాజ్ మరియు వైశాఖ్ కాంబోలో ఇంతకుముందే ఓ మూవీ వచ్చింది . ఇక ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత మరోసారి ఓ భారీ ప్రాజెక్టు రాబోతుంది . 2010లో పోకిరి రాజా తో అలరించిన వీరిద్దరూ కలిసి ఈ మూవీ కోసం పనిచేస్తున్నారు . ఇక షూటింగ్ వేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఓనమ్  పండగ సందర్భంగా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతుంది . ఇక ప్రస్తుతం పృధ్వీరాజ్ పుట్టినరోజు సందర్భంగా వచ్చిన ఈ అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: