టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వ్యక్తిగత రూమర్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా రామ్ చరణ్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆయన భార్య ఉపాసన కామినేని గురించి, ఆమె రెండవసారి గర్భం దాల్చిందనే వార్తలపై అనేక ఊహాగానాలు, అసత్య ప్రచారాలు విస్తరిస్తున్నాయి. కొంతమంది సోషల్ మీడియా యూజర్లు మాత్రం ఈ విషయం మీద పూర్తిగా హద్దులు దాటేలా పోస్టులు చేస్తూ,  నిరాధారంగా కామెంట్లు చేస్తున్నారు. ఉపాసన ట్విన్స్‌కి జన్మ ఇవ్వబోతోందని, ఆమె దీనికోసం ప్రత్యేకమైన మాత్రలు మరియు ఇంజెక్షన్లు వాడిందని చెత్త వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విధంగా వ్యక్తిగత విషయాలను వక్రీకరించి, అబద్ధపు రూమర్స్ సృష్టించడం పట్ల రామ్ చరణ్ తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది.


వారి కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను ఇంత బహిరంగంగా, అబద్ధాలతో నింపి ప్రచారం చేయడం సహించలేమని మెగా ఫ్యామిలీ వర్గాలు మండిపడుతున్నయ్. ఇప్పటికే రామ్ చరణ్ టీమ్ ఆ రూమర్స్ పుట్టించిన సోషల్ మీడియా అకౌంట్స్‌ను గుర్తించే ప్రక్రియ ప్రారంభించిందట. తప్పుడు సమాచారం పంచినవారిపై చట్టపరమైన చర్యలు (లీగల్ యాక్షన్) తీసుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని దగ్గరి వర్గాల సమాచారం. ఇకపై ఎవరు అయినా రామ్ చరణ్, ఉపాసన లేదా మెగా కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత అంశాలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం, తప్పుడు వార్తలు రాయడం లేదా వీడియోలు తయారు చేయడం చేస్తే వారికి కఠినమైన లీగల్ నోటీసులు ఇవ్వాలని మెగా ఫ్యామిలీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.


సోషల్ మీడియా ఒక వేదిక మాత్రమే కానీ దాన్ని వ్యక్తిగత జీవితాలపై దాడి చేసే ఆయుధంగా మార్చకూడదని, ఒక స్టార్ హీరో కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని నిందారోపణలు చేయడం చాలా బాధాకరమని రామ్ చరణ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆ రూమర్స్‌పై రామ్ చరణ్ టీమ్ అధికారిక క్లారిఫికేషన్ మరియు లీగల్ స్టేట్‌మెంట్ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: