ఇండియన్ సినిమా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘గ్లోబ్ ట్రాటర్’ (SSMB29) టైటిల్ రివీల్ ఈవెంట్‌పై దేశవ్యాప్తంగా అద్భుతమైన హైప్ నెలకొంది. ఈ రోజు సాయంత్రం జరుగనున్న ఈ ఈవెంట్ కోసం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాట్లు అలంకారికంగా పూర్తి చేశారు. భారీ సెట్‌లు, అత్యాధునిక లైటింగ్, ప్రత్యేక స్టేజ్ డిజైన్స్—ప్రతి అంశం కూడా వరల్డ్ స్టాండర్డ్స్‌కు తగ్గట్టే ప్లాన్ చేశారు.పాస్‌పోర్ట్ స్టైల్ ఇన్విటేషన్స్ విడుదల చేసినప్పటి నుంచే జక్కన్న సృష్టించబోయే మ్యాజిక్‌పై ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ ఆకాశాన్ని తాకింది. దేశం నలుమూలలతో పాటు విదేశాల నుండీ మహేష్ బాబు అభిమానులు భారీ ఎత్తున ఈవెంట్‌కు చేరుకుంటున్నారు.

ఈ రోజు స్టేజ్ మీద కనిపించబోయే కీలక హైలైట్స్:

*భారత సినిమా చరిత్రలోనే తొలిసారి 130 అడుగుల భీకరమైన ళేడ్ స్క్రీన్

*మహేష్ బాబు కోసం డిజైన్ చేసిన స్పెషల్ ‘మాసివ్ ఎంట్రీ’ సీక్వెన్స్

*మూడు విభిన్న కాన్సెప్ట్స్‌తో రూపొందించిన ట్రిపుల్ గ్రాండియర్ గ్లింప్స్ వీడియో

*జక్కన్న స్టైల్‌లో ప్లాన్ చేసిన హై-వోల్టేజ్ ప్రెజెంటేషన్

అయితే ఈ ఈవెంట్‌ను ఎందుకు ఇప్పుడే… అదే నవంబర్ 15నే ప్లాన్ చేశారని అనేక మంది అనుమానం వ్యక్తం చేస్తుంటే, దానికి వెనుక ఉన్న కారణం ఎంతో భావోద్వేగంతో నిండి ఉంది.నవంబర్ 15 అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రి, దివంగత నటసార్వభౌమ కృష్ణ గారి వర్ధంతి. తెలుగు సినీ పరిశ్రమకు అపార సేవలందించిన కృష్ణ గారిని మహేష్ బాబు ఎప్పటికీ మరిచిపోలేడు. ప్రతీ ఏడాది ఈ రోజు ఆయనను ప్రత్యేకంగా స్మరించుకుంటాడు. ఆ ప్రేమను, ఆ గౌరవాన్ని ప్రతిబింబించేలా, ఈసారి తన కెరీర్‌లోనే అతిపెద్ద ఈవెంట్‌ను కూడా ఇదే రోజున నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ భావోద్వేగానికి రాజమౌళి కూడా పూర్తిగా సపోర్ట్ ఇచ్చి, ఈ రోజు మహేష్ బాబుకు జీవితాంతం గుర్తుండిపోయేలా ఒక మహత్తరమైన ఈవెంట్‌ను రూపకల్పన చేశారు. ‘గ్లోబ్ ట్రాటర్’ ద్వారా తెలుగు సినిమా ప్రపంచానికి కొత్త స్టాండర్డ్స్‌ను చూపించబోతుందన్న నమ్మకం ఇప్పుడు ఫ్యాన్స్‌లో మాత్రమే కాదు, మొత్తం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: