ఈ ఇద్దరి మధ్య ఉన్న బంధం చాలా ప్రత్యేకం. మహానటి, కల్కి సినిమాలకు సింగీతం శ్రీవారు క్రియేటివ్గా చేసిన కాంట్రిబ్యూషన్స్ అసలైన సీక్రెట్ ఇన్పుట్స్ అని యూనిట్ సభ్యులే చెప్తారు. నాగ్ అశ్విన్కి అయితే చిన్నప్పటి నుంచే సింగీతం అంటే పిచ్చి అభిమానం. ఆ కల నుండి బయటికి వచ్చి - ఇప్పుడు నిజంగా రియాలిటీ అయ్యిందని ఇండస్ట్రీ టాక్. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించే కొత్త సినిమాను నాగ్ అశ్విన్ స్వయంగా నిర్మించబోతున్నట్టు ఇన్సైడ్ న్యూస్. ఈ సినిమా పూర్తిగా సింగీతం మార్క్ ఎక్స్పెరిమెంటల్ కంటెంట్తో ఉండనుందని చెబుతున్నారు. ఎటువంటి కమర్షియల్ బౌండరీలు లేకుండా, ఫ్రీ ఫ్లో క్రియేటివిటీతో సింగీతం మళ్లీ అదిరిపోయే కథ చెబుతారని అంచనాలు.
ముఖ్యంగా నటీనటులంతా కొత్తవారే అన్న విషయం మరింత థ్రిల్లింగ్. థియేటర్లో కొత్త ముఖాలు, కొత్త కథ, కొత్త ట్రీట్మెంట్ … పర్ఫెక్ట్ సింగీతం స్టైల్! మరికొక హైలైట్ - ఈ ప్రాజెక్ట్కు మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీ ప్రసాద్ని ఎంపిక చేసినట్టు సమాచారం. సింగీతం సర్ క్లాసిక్ తరహా కథ–నారేషన్… DSP ఎనర్జిటిక్ మ్యూజిక్… ఇది కాంబినేషన్ కేవలం అద్భుతం కాదు, జనరేషన్ల గ్యాప్ని కలిపే అరుదైన కలయిక. ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం ప్రాజెక్ట్ పేపర్వర్క్ పూర్తయ్యింది. త్వరలో అధికారిక ప్రకటన రావొచ్చు. ఒక వైపు లెజెండరీ మైండ్… మరో వైపు యంగ్ విజనరీ… ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా అనగానే టాలీవుడ్ మాత్రమే కాదు, భారతీయ సినిమా ప్రపంచం చూస్తుంది. సింగీతం - నాగ్ అశ్విన్ కాంబినేషన్ ఒక సినిమా కాదు … ఓ క్రియేటివ్ ఫెస్టివల్. ఇప్పుడు అందరి కళ్లూ ఈ ప్రాజెక్ట్ మీదే!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి