షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం తిమ్మాపూర్ వద్ద 5 మంది గంజాయి స్మగ్లర్లు పెద్ద ఎత్తున గంజాయి తీసుకెళుతూ పట్టుబడిపోయారు. 70 లక్షల రూపాయల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మూడు కార్ల తో పాటు మొబైల్ ఫోన్లు రూ.2.10లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు కొత్తూరు పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శంషాబాద్ డిసిపి జగదీశ్వర్ రెడ్డి వెల్లడించారు. షాద్ నగర్ ఏసిపి కుశాల్కర్, కొత్తూరు పట్టణ సీఐ శ్రీధర్ భూపాల్, శంషాబాద్ ఎస్ఓటి వెంకట్ రెడ్డి, ఎస్ఐ రవి తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ డిసిపి పి. జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ  కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ వద్ద విశ్వసనీయ సమాచారం ప్రకారం.. శంషాబాద్ సీఐ వెంకట్ రెడ్డి, కొత్తూరు సీఐ శ్రీధర్ భూపాల్ జాయింట్ ఆపరేషన్లో భాగంగా పెద్ద ఎత్తున మూడు కార్లను రాత్రి ఒంటిగంట సమయంలో చాకచక్యంగా పట్టుకున్నట్లు డిసిపి వివరించారు.

 ఏపీ 10బీఏ 5345, వోక్స్ వ్యాగన్ కారులో సుమారు 214 కిలోల గంజాయి వీటి విలువ 70 లక్షల రూపాయలు విలువైన 107 గంజాయి ప్యాకెట్లను  ఇతర వాహనాల్లో మార్చుకునే క్రమంలో పోలీసులు దాడి చేసి పట్టుకున్నట్టు డిసిపి తెలిపారు. మహారాష్ట్రకు చెందిన ఎం.హెచ్ 12హెచ్. ఎఫ్ 5992 మారుతి సుజుకి కారు, అదేవిధంగా ఎం.హెచ్ 12ఓ5 8185 హోండాకార్ లో గంజాయి అక్రమ రవాణా స్మగ్లింగ్ జరుగుతుందని సమాచారం రావడంతోనే శంషాబాద్ ఎస్ఓటి, కొత్తూరు పోలీసులు పథకం ప్రకారం పట్టుకున్నారని తెలిపారు. సీలేరు నుండి నాగరాజు అనే వ్యక్తులు ఫారెస్ట్ నుండి ఈ గంజాయిని సేకరించి వాటిని మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. రవి, నాగరాజు అనే కీలక వ్యక్తులకు సంబంధించిన మహారాష్ట్ర అహ్మద్ నగర్ కు చెందిన బాబా చందేకర్ (45), అదేవిధంగా తిరుమలి బాలు (39), గణేష్ లాహోరి (39), రాజేంద్ర (45), అదేవిధంగా సూర్యాపేట జిల్లా గరిడేపల్లికి చెందిన మాలోత్ వినోద్ (28) వీరికి భాగస్వాములుగా పని చేస్తున్నట్లు తెలిపారు. ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దుల నుండి మహారాష్ట్రకు గంజాయి తరలించే క్రమంలో తిమ్మాపూర్ వద్ద కాపుకాసి గంజాయి స్మగ్లింగ్ ముఠాను పట్టుకున్నట్లు పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: