ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అండ్ కో గత ఎన్నికల్లో వైసీపీ చేతిలో ఓడిపోయి అధికారాన్ని కోల్పోయింది. ఇక మరోవైపు ఎన్నికల్లో ప్రజల సంపూర్ణ మద్దతుతో సీఎం అయిన జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం 2024 ఎన్నికలకు ఒక సంవత్సరం మరియు మూడు నెలలు మాత్రమే సమయం ఉంది. మిగిలిన ఈ కొద్ది సమయాన్ని అయి వైసీపీ ఇటు టీడీపీలు వాడుకుని ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో వరుస పర్యటనలతో ప్రజలను వైసీపీ మత్తు నుండి వదిలించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

అందులో భాగంగా చంద్రబాబు కొత్త సంవత్సరంలో తన సొంత నియోజకవర్గం అయిన చిత్తూరు జిల్లాలోని కుప్పంకు వెళ్లనున్నారు. చంద్రబాబు పిఎ అందించిన సమాచారం ప్రకారం. బెంగళూర్ నుండి 4 వ తేదీన చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా కుప్పం కు వస్తారట. వరుసగా 7 సార్లు కుప్పం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గా గెలిచిన చంద్రబాబుకు ఈసారి మాత్రం కష్టంగా మారే అవకాశం ఉంది. కుప్పంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ని ఓడించి వైసీపీ విజయకేతనం ఎగుర వేసింది. ప్రస్తుతం కుప్పం నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి గా ఉన్న భరత్ చంద్రబాబు కు ప్రత్యర్థిగా మారి ఎన్నికల్లో ఢీ కొట్టనున్నారు.

భరత్ ఇంఛార్జి గా క్షేత్రస్థాయిలో ప్రజలను ఒక్కతాటిపైకి తెచ్చి వైసీపీని బలోపేతం చేస్తున్నారు. కాగా ఈ రోజుతో నెల్లూరు జిల్లాలో చంద్రబాబు చేస్తున్న పర్యటన పూర్తి కానుంది. మరి చూద్దాం వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు వరుసగా ఎనిమిదవసారి ఎన్నికల్లో గెలిచి రికార్డును మరింత పెంచుకుంటాడా లేదా స్థానిక ఎన్నికల లాగే వైసీపీ చేతిలో ఓడిపోతారా అన్నది తెలియాల్సి ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: