రోజా... అధికార వైసీపీలో ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే. రెండోసారి నగరి నుంచి గెలిచి.... అధికార పక్షంలో కీలకంగా మారారు. అయితే అధికారంలోకి వచ్చిన రోజా తన ఫుల్ ఫైర్ ని పూర్తిగా చూపించలేదు. మొదటిసారి గెలిచినప్పుడు ప్రతిపక్షానికి పరిమితమైన రోజా, అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీని, అధినేత చంద్రబాబుపై ఒంటికాలి మీద వెళ్ళి విమర్శలు చేసి ముప్పుతిప్పలు పెట్టారు. కానీ అప్పుడే ఓ రేంజ్ లో ఫైర్ చూపించిన రోజా, అధికారంలోకి వచ్చాక కాస్త తగ్గారు. మంత్రి వర్గంలో అవకాశం దక్కకపోవడమే దీనికి కారణమని చాలరోజులు ప్రచారం జరిగింది.

 

ఈ క్రమంలోనే ఆమెకు ఏ‌పి‌ఐ‌ఐ‌సి ఛైర్మన్ పదవి ఇచ్చారు. ఇక పదవి వచ్చిన ఆమె పెద్దగా చంద్రబాబు అండ్ బ్యాచ్ పై ఫైర్ అవ్వలేదు. అలాగే మొదట్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా పెద్ద హైలైట్ కాలేదు. అయితే తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆమె విశ్వరూపం చూస్తున్నారు. ఒక్కసారిగా చంద్రబాబు, లోకేశ్ లు టార్గెట్ గా ఓ రేంజ్ లో విమర్శలు చేస్తున్నారు. లోకేశ్ కు సరిగా మాట్లాడటమే రాదని, కొడుకుని కూడా గెలిపించుకొని దద్దమ్మ చంద్రబాబు అంటూ విమర్శల వర్షం కురిపించారు.

 

అలాగే జగన్ పై పొగడ్తల వర్షం కురిపిస్తూనే...బాబుకు బ్యాండ్ మోత మొగిస్తున్నారు. గడ్డిపరక గర్జించినంత మాత్రాన సింహం కాదని చంద్రబాబు గాలి పూర్తిగా తీసేస్తున్నారు. అసెంబ్లీ సమావేశంలో ప్రతిరోజూ ఆమె ఏదొకవిధంగా మాట్లాడుతూ...చంద్రబాబు పరువు అడ్డంగా తీసేస్తున్నారు. ఇక ఇది చూసిన వైసీపీ అభిమానులు తమ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే మళ్ళీ ఫామ్ లోకి వచ్చేశారని చర్చించుకుంటున్నారు. 

 

అయితే జగన్ రెండున్నర ఏళ్లలో మంత్రివర్గం మార్పు చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కొందరు ఎఫెక్టివ్ గా ప్రతిపక్షంపై విమర్శలు చేయని తరుణంలో రోజా ఫామ్ లోకి వచ్చారు. మంత్రులని సైతం మించి చంద్రబాబుని ఒక ఆట ఆడేసుకుంటున్నారు. ఇలా రోజా ఫైరింగ్ బట్టి చూస్తే...ఆమెకు మంత్రి పదవి కూడా దక్కే అవకాశముందని వైసీపీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతుంది.   

 

మరింత సమాచారం తెలుసుకోండి: