చంద్రబాబు పర్సనల్ సెక్రటరీ అయిన శ్రీనివాస్ ఇంట్లో ఐటి సోదాలు ఆంధ్ర రాజకీయాల్లో పెను సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇన్కమ్ టాక్స్ సోదాల్లో ఏకంగా రెండు వేల కోట్లకు పైగా బయటపడడం ఆంధ్ర రాజకీయాల్లో పెను దుమారమే రేపింది . టిడిపి అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు చంద్రబాబు పర్సనల్ సెక్రటరీ అయిన శ్రీనివాస్ తన దగ్గర రెండు వేల కోట్ల విలువైన బ్లాక్ మనీ దాచుకున్నారు అంటూ విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. అప్పటికే ప్రతీ విషయంలో... చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించే అధికార వైసిపి పార్టీ.. ఇన్కమ్ టాక్స్ రైడ్ ల తర్వాత మరింతగా విమర్శలు గుప్పించింది.
ఇదే సమయంలో కొంతమంది టీడీపీ నేతలు సైతం ఐటీ రైడ్స్ లో రెండు వేల కోట్లు దొరికడాన్ని వ్యతిరేకించారు. ఇక తాజాగా ఏపీ మంత్రి కొడాలి నాని ఢిల్లీ పర్యటనలో భాగంగా... సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన... ఏపీ మంత్రి కొడాలి నాని చంద్రబాబు మాజీ పర్సనల్ సెక్రటరీపై ఐటీదాడులకు సంబందించి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఇన్కమ్ టాక్స్ సోదాల్లో రెండు వేల కోట్ల క్యాష్ దొరికింది అని ఎవరూ చెప్పలేదు అంటూ కూడా కొడాలి నాని వ్యాఖ్యానించారు.
రెండు వేల కోట్ల రూపాయలు పర్సనల్ సెక్రటరీ దగ్గర పెట్టుకోవడానికి చంద్రబాబు పిచ్చోడు కాదు అంటూ వ్యాఖ్యానించారు కొడాలి నాని . రెండు వేల కోట్ల రూపాయల క్యాష్ ఎవరు ఇంట్లో పెట్టుకుని కూర్చోరు అంటూ వ్యాఖ్యానించారు. అయితే చంద్రబాబు మాత్రం పర్సనల్ సెక్రటరీ శ్రీనివాస్ దగ్గర రెండు వేల కోట్లు అక్రమ సంపాదనకు సంబందించిన ఆస్తులు నగలు నగదు కు సంబంధించిన వివరాలు దొరికాయి అంటూ కొడాలి నాని ఆరోపించారు. చంద్రబాబు చెప్పినట్లు డబ్బులు ఇచ్చిన విషయాన్ని చంద్రబాబూ శ్రీనివాస్ తన డైరీలో రాసుకున్నారు అంటూ విమర్శించారు కొడాలి నాని . చంద్రబాబు చేసిన అక్రమాలకు శిక్ష తప్పదు అంటూ వ్యాఖ్యానించారు.