మాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సమంత ఆ తర్వాత తెలుగు ప్రేక్షకులందరికీ మాయ చేసి... ఏకంగా అక్కినేని వారసుడు నాగచైతన్య ని బుట్టలో వేసుకున్నది . ఇక మొదటి సినిమాతోనే తన చిలిపి నవ్వుతోనే తెలుగు ప్రేక్షకుల మతి పోగొట్టిన ఈ అమ్మడు వరుస  అవకాశాలను చేజిక్కించుకుని ఎన్నో గ్లామర్ పాత్రలో మెరిసింది. ఇక ఆ తర్వాత ఎన్నో ఏళ్లపాటు నాగచైతన్య తో ప్రేమాయణం నడిపి ఆ తర్వాత ఇద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు. ఇక అక్కినేని వారి కోడలు గా మారిన సమంత క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అయితే ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయిన సమంతా క్రేజ్ ని సరిగ్గా బ్యాలెన్స్ చేసింది ఈ అమ్మడుకు. పెళ్లి తర్వాత గ్లామర్ పాత్రలకు పూర్తిగా దూరమైపోయింది. 

 

 

 గ్లామర్ పాత్రలకు దూరంగా పెట్టి తనలోని నటిని అందరికీ తెలియజెప్పేలా వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే పలు లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడంతో పాటు... భిన్నమైన కథల్లో కూడా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గానే కాకుండా అందరికి ఇన్స్పిరేషన్ గా ఉండేలా ముందుకు సాగుతుంది సమంత. అయితే మొన్నటికి మొన్న తమిళ హిట్ మూవీ 96 తెలుగు రీమేక్ గా వచ్చిన జాను సినిమాలో శర్వానంద్ సరసన నటించింది సమంత. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోవడం తో సమంత కు నిరాశే ఎదురైంది. 

 

 

 ఈ క్రమంలో సమంత జాను తర్వాత ఏ సినిమా చేయబోతున్నారు అంటే టాలీవుడ్లో మాత్రం క్లారిటీ లేదు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రంలో సమంతా నటించనున్నారని టాక్ వినిపిస్తుంది. మరి తమిళ సినిమాల విషయానికొస్తే. కాదు వాక్కుల రెండు కాదల్ అనే సినిమాకు సమంత సైన్ చేసినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా తాజాగా ఓ లేడి ఓరియంటెడ్ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట అక్కినేని వారి కోడలు సమంత. మాయ గేమ్ ఓవర్ లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు అశ్విన్ శరవణన్ ఈ  సినిమాను తెరకెక్కించబోతున్నారు. తెలుగులో ఓ బేబీ లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాతో మంచి హిట్ అందుకున్న సమంత తమిళంలో కూడా ఈ మ్యాజిక్ ని రిపీట్ చేయబోతున్నారు అని అంటున్నారు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: