దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కట్టడి వ్యూహాలపై కేంద ప్రభుత్వం మరింతగా దృష్టి సారించింది. అందుకే ఢిల్లీలోని రాజనాథ్ సింగ్ నివాసంలో మంత్రుల బృందం భేటీ అయ్యింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ఈ భేటీలో చర్చిస్తున్నారు.

కరోనా వ్యాప్తి నివారణ చర్యలు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల అమలు తీరు తెన్నులపై చర్చిస్తున్నారు. దేశంలో లాక్ డౌన్ అమలవుతున్న తీరు ఎలా ఉంది.. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరగటంనా చర్చిస్తున్నారు. ఈ భేటీకి రాజనాథ్ సింగ్, అమిత్ షా, స్మృతి ఇరానీ, ప్రకాష్ జవదేకర్, కిషన్ రెడ్డి తదితర మంత్రులు హాజరయ్యారు.

 

 

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రయత్నిస్తున్న వైద్య సిబ్బంది, ఆరోగ్య సిబ్బందిపై అక్కడక్కడా దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వ్యూహాలపైనా మంత్రులు చర్చించే అవకాశం ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: