అయితే ప్రస్తుతం ఫేస్బుక్ ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్ కస్టమర్ల అందరికీ త్వరలో భారీ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. త్వరలో వాట్సాప్ సర్వీసులపై ఛార్జీలు విధించేందుకు ఫేస్బుక్ సిద్ధమవుతోంది. అయితే ఈ ఛార్జీలు మాత్రం ప్రతి ఒక్కరికీ వర్తించవు అని చెప్పాలి. ఇప్పటివరకు ఎవరైతే వాట్సాప్ కస్టమర్లు బిజినెస్ వాట్సాప్ సర్వీసులను పొందుతున్నారో వారికి మాత్రమే సరికొత్తగా చార్జీలు విధించేందుకు నిర్ణయించింది ఫేస్బుక్. త్వరలోనే బిజినెస్ అకౌంట్ వాడుతున్న కస్టమర్ల నుంచి పలు సర్వీసులకు గానూ ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమవుతోంది.
వాట్సప్ ఒక బ్లాగ్ లో పోస్ట్ లో ఈ విషయాన్ని క్లుప్తంగా వెల్లడించింది. కాగా వాట్సాప్ బిజినెస్ అకౌంట్ కలిగి ఉన్న కస్టమర్లు ఇప్పటికే ఐదు కోట్ల మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణ కస్టమర్లకు కాకుండా కేవలం బిజినెస్ వాట్సాప్ అకౌంట్ ఉన్న కస్టమర్లకు మాత్రమే చార్జీలు వసూలు చేసేందుకు నిర్ణయించాము అంటూ ఇటీవల ఫేస్ బుక్ తెలిపింది. అన్ని సేవలకు కాకుండా కేవలం కొన్ని ఎంపిక చేసిన సేవలకు మాత్రమే ఛార్జీలు వసూలు చేసేందుకు నిర్ణయించామని.. దీనిద్వారా వాట్సప్ కీ కూడా నిధులు లభించనున్నాయి అంటూ తెలిపింది ఫేస్బుక్. ఈ చార్జీలు వసూలు చేయడం ద్వారా కస్టమర్లకు మరింత మెరుగైన సర్వీసులను అందించేందుకు వీలవుతుంది అంటూ చెప్పుకొచ్చింది.