ప్రస్తుతం చైనాకు పాకిస్తాన్ బానిస దేశం గా మారిపోయిన విషయం తెలిసిందే. అడిగినప్పుడల్లా ఆర్థిక సహాయం చేస్తున్న చైనా ఏం చెప్పినా తల ఊపుతూ బానిస దేశం గా మారిపోయింది పాకిస్తాన్. తమ దేశ ప్రజల ప్రయోజనాలను గాలికొదిలేసి తమ సార్వభౌమత్వాన్ని కూడా చైనా దగ్గర తాకట్టు పెట్టింది. ఈ క్రమంలోనే ప్రతి విషయంలో కూడా చైనా మీద ఆధారపడుతూ ఆర్థిక సహాయం పొందుతూ ఉంటుంది పాకిస్తాన్. పాకిస్తాన్ చైనా చెప్పుచేతుల్లో ఉన్నప్పటికీ... చైనా మాత్రం పాకిస్తాన్ విషయంలో ఎంతో వ్యూహాత్మకంగానే ముందుకు వెళ్తూ ఉంటుంది.



 ఓవైపు మిత్ర దేశంగా భావిస్తూ ఆర్థిక సహాయం చేస్తున్నట్లు పైపైకి మాటలు చెబుతూనే మరోవైపు ఎంతో వ్యూహాత్మకంగా భూభాగాలను స్వాధీనం చేసుకునేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటుంది చైనా. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇలాంటి తరహా వ్యూహాన్ని అమలు చేసింది చైనా. ఇప్పటికే పాకిస్తాన్ లో ఎన్నో రకాల ప్రాజెక్టుల్లో చైనా పెట్టుబడులు పెడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వి ఆర్ ఐ రైల్వే ప్రాజెక్టును  పాకిస్తాన్లో పట్టింది చైనా. కరాచీ నుంచి పెషావర్ వరకు రెండు వేల ఆరు వందల యాభై కిలోమీటర్ల రైల్వే ప్రాజెక్ట్ ఇది. దీంట్లో 10 శాతం పెట్టుబడి పాకిస్తాని పెడితే 90 శాతం పెట్టుబడి చైనా పెట్టింది ఆ తర్వాత పాకిస్తాన్ దఫాల వారీగా  ఆ అప్పు చెల్లించేందుకు కూడా అవకాశం కల్పించింది చైనా .



 ఈ ప్రాజెక్టు విషయంలో ఇటీవలే చైనా సరి కొత్త విధానాన్ని అమలు చేసింది. ఇటీవలే ఈ ప్రాజెక్టును నిలిపివేసింది చైనా. అయితే ఇప్పటివరకు సదరు ప్రాజెక్టు కోసం చైనా పెట్టిన పెట్టుబడి గాను  పాకిస్తాన్ లోని పలు భాగాలను తనకు అప్పగించాలని చైనా సరికొత్త ఈ ప్రతిపాదనను తెరమీదకు తెచ్చే అవకాశాలు ఉన్నట్లు ప్రస్తుతం విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఓ వైపు పాకిస్తాన్ తో  మిత్ర దేశంగా ఉంటూనే మరోవైపు ఎంతో  వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ పాకిస్తాన్  కు సంబంధించిన అన్ని భూభాగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు చైనా ప్రయత్నిస్తుంది అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: