అదేసమయంలో ప్రియుడితో సుఖానికి కట్టుకున్నవారు అడ్డు వస్తున్నారు అన్న ఈ కారణంతో ఏకంగా కట్టుకున్న భర్తనే దారుణంగా మహిళ హత్య చేసిన ఘటన కూడా తెర మీదికి వస్తున్నాయి. ఇక్కడ అక్రమ సంబంధం నెపంతో దారుణం జరిగిపోయింది. భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు అని కోపంతో ఏకంగా ఒక మటన్ వ్యాపారి ప్రియుడిని దారుణంగా నరికి చంపిన ఘటన కరీంనగర్లో వెలుగులోకి వచ్చింది. మటన్ కత్తితో దారుణంగా భార్య ప్రియుడు తల నరికి హతమార్చాడు. ఈ ఘటనతో స్థానికులు అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు.
హుస్సేన్ పూర్ కి చెందిన మటన్ వ్యాపారి ఎండి వలిం పాషా ను మరో మటన్ వ్యాపారి సయ్యద్ అఫ్జల్ కిరాతకంగా నరికి చంపాడు. బైక్ పై వస్తున్న ఎండి వలిం పాషా ని అడ్డగించి దారుణంగా హతమార్చినట్లు తెలుస్తోంది. అయితే మటన్ వ్యాపారం చేసే ఎండి వలిం పాషా అనే వ్యక్తి మరో మటన్ వ్యాపారి అయిన అఫ్జల్ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొన్ని రోజులపాటు భర్తకు తెలియకుండా రహస్యంగా వీరు కలుసుకునే వారు. ఆ తర్వాత నిజం బయటపడడంతో జీర్ణించుకోలేక పోయిన భర్త చివరికి భార్య ప్రియున్ని దారుణంగా హతమార్చాడు. ఇక రంగ ప్రవేశం చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.