నేటి రోజుల్లో కట్టుకున్న బంధానికి విలువ లేకుండా పోతుంది క్షణకాల సుఖం కోసం ఏకంగా పరాయి వ్యక్తుల మోజులో పడుతున్న ఎంతోమంది... కట్టుకున్న వారిని మోసం చేస్తూ పరాయి వ్యక్తులతో రాసలీలలు కొనసాగిస్తున్నారు. దీంతో చివరికి అసలు నిజం బయట పడడంతో  భార్య భర్తల బంధం తెగిపోవడమే  కాదు ఏకంగా దారుణ ఘటనలకు  కూడా దారితీస్తుంది. ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాల నేపథ్యంలో జరుగుతున్న దారుణ ఘటనలో రోజురోజుకు ఎక్కువవుతున్నాయి అన్న విషయం తెలిసిందే. కట్టుకున్న భార్య అక్రమ సంబంధం పెట్టుకున్నది  అని కోపంతో దారుణంగా హత్యలకు పాల్పడుతున్నారు




 అదేసమయంలో ప్రియుడితో సుఖానికి కట్టుకున్నవారు అడ్డు వస్తున్నారు అన్న ఈ కారణంతో ఏకంగా కట్టుకున్న భర్తనే దారుణంగా మహిళ హత్య చేసిన ఘటన కూడా తెర మీదికి వస్తున్నాయి.  ఇక్కడ అక్రమ సంబంధం నెపంతో దారుణం జరిగిపోయింది. భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు అని కోపంతో ఏకంగా ఒక మటన్ వ్యాపారి ప్రియుడిని దారుణంగా నరికి చంపిన ఘటన కరీంనగర్లో వెలుగులోకి వచ్చింది. మటన్ కత్తితో దారుణంగా భార్య ప్రియుడు తల నరికి హతమార్చాడు. ఈ ఘటనతో స్థానికులు అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు  గురయ్యారు.



 హుస్సేన్ పూర్ కి చెందిన మటన్ వ్యాపారి ఎండి వలిం పాషా ను   మరో మటన్ వ్యాపారి సయ్యద్ అఫ్జల్   కిరాతకంగా నరికి చంపాడు. బైక్ పై వస్తున్న ఎండి వలిం పాషా ని అడ్డగించి దారుణంగా హతమార్చినట్లు  తెలుస్తోంది. అయితే మటన్ వ్యాపారం చేసే ఎండి వలిం పాషా అనే వ్యక్తి మరో మటన్ వ్యాపారి అయిన అఫ్జల్  భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొన్ని  రోజులపాటు భర్తకు తెలియకుండా రహస్యంగా వీరు కలుసుకునే వారు. ఆ తర్వాత నిజం  బయటపడడంతో జీర్ణించుకోలేక పోయిన భర్త చివరికి భార్య ప్రియున్ని  దారుణంగా హతమార్చాడు. ఇక రంగ ప్రవేశం చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: