ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు జరుగుతున్న కొన్ని అంశాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా కక్ష సాధింపు వైఖరితో ముందుకు వెళ్తుంది. గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి సహకరించారు అనే కారణంతో కొందరు అధికారులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు.  ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఆయన అవినీతి చేసారని ఆయనను సస్పెండ్ చేసారు. జస్టిస్ ఎఎం ఖన్‌విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిల ధర్మాసనంలో విచారణ జరిగింది.

ఏడాది నుంచి సస్పెన్షన్ పొడిగింపుపై సర్వీస్ నిబంధనలు చూపించాలన్న ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. అఖిల భారత సర్వీసు నిబంధనల్లోని రూల్ 3లో 1-సీ కింద సస్పెన్షన్ పొడిగించామని తెలిపిన ఏపీ ప్రభుత్వం... రివ్యూ కమిటీ నిర్ణయం ప్రకారం ఆరు నెలల తర్వాత సస్పెన్షన్ పొడింగించినట్లు సుప్రీం కోర్ట్ కి వివరించింది. ఏబీ వెంకటేశ్వరరావుపై అవినీతి చార్జ్ లేదని.. రూల్ 3లోని 1-బీ ప్రకారం ఏడాది కంటే ఎక్కువ సస్పెన్షన్ ఉండటానికి వీల్లేదని ఏబీ వెంకటేశ్వరరావు తరపు న్యాయవాది ఆదినారాయణరావు సుప్రీం కోర్ట్ కి వివరించారు.

మరి అలాంటప్పుడు సస్పెన్షన్ పొడిగించిన రివ్యూ కమిటీ ఆదేశాలను ఎందుకు సవాలు చేయలేదని ఏబీ వెంకటేశ్వరరావు తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా నిలదీసింది. సస్పెన్షన్ పొడిగిస్తూ రివ్యూ కమిటీ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేసేందుకు మూడు రోజుల గడువు కోరారు న్యాయవాది ఆదినారాయణరావు. మూడు రోజుల్లో సస్పెన్షన్ పొడిగింపు ఆదేశాలను సవాలు చేస్తూ అప్లికేషన్ వేసేందుకు ఏబీ వెంకటేశ్వరరావుకు అనుమతి ఇచ్చింది. ఏబీ వెంకటేశ్వరరావు వేసే అప్లికేషన్ పై ఆ తర్వాతి మూడు రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం ఇచ్చింది సుప్రీం కోర్ట్. తదుపరి విచారణ మార్చి 9కి వాయిదా వేసింది సుప్రీం కోర్ట్. ఇక ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసే వకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: