మున్సిపల్ ఎన్నికల ప్రచారం సమయంలో టీడీపీ-వైసీపీ మాటల యుద్ధం ఓ రేంజ్‌లో సాగుతోంది. విజయవాడలో పర్యటించిన చంద్రబాబు.. వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు. వైసీపీ మంత్రులను కొబ్బిరి చిప్పల మంత్రి, బూతుల మంత్రి అంటూ  రెచ్చిపోయారు. తాను రౌడీలకు రౌడీనంటూ  గర్జించారు. దీనికి వైసీపీ మంత్రులు కూడా ఘాటుగానే సమాధానం ఇచ్చారు. చంద్రాబాబు ఓ ముసలి రౌడీ.. పవన్ కళ్యాణ్ ఓ మాటల రౌడీ అంటూ పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.

ఈ ఇద్దరూ ప్రజలను మోసం చేయడాన్ని మానాలన్న పేర్ని నాని.. ప్రధాని మోదీతో మాట్లాడి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా కాపాడాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ సాధించేందుకు ఏదో చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు.. బెజవాడ బజారు లోకి కేంద్రాన్ని తీసుకువస్తామని గతంలో పవన్ కళ్యాణ్ చెప్పారని.. గుర్తు చేశారు. రౌడీ రాజ్యం అంటోన్న పవన్ కళ్యాణ్ .. రాష్ట్రంలో ప్రశాంతంగా ఎలా తిరగగలుగుతున్నారని  ప్రశ్నించారు.

ఎబీసీడీ రాజ్యం అంటూ ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును చంద్రబాబు చదువుతున్నారని.. హెరిటేజ్ అంతా చంద్రబాబు అవినీతి నిండిపోయిందని.. పేర్ని నాని అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.." అసలు అమరావతి లో చంద్రబాబు ఏం చేశారు.. వందల ఎకరాలు మీరు వందిమదిగలు దోచుకున్నారు..అమరావతిలో వేల ఎకరాలను అమాయక రైతులను బెదిరించి లాక్కున్నారు..అమరావతి పేరుతో చంద్రబాబు గుంటూరు, విజయవాడను చంద్రబాబు సర్వనాశనం చేశారు..చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని తిరిగి విజయవాడలో ప్రజలను ఓట్లు అడుగుతున్నారన్నారు.

వెళ్లిన ప్రతి ప్రాంతానికి వెళ్లి ఆ ప్రాంతమంటే తనకు ఇష్టం ,ప్రాణం అంటారు. విశాఖ, కుప్పం, విజయవాడ  వెళ్లి ఆయా ప్రాంతాలంటే  ప్రాణమని చెబుతారని.. దోచుకోవడం, దాచుకోవడం పైనే చంద్రబాబుకు ప్రేమ, మమకారం ఉంటుంది..చంద్రబాబు తిరిగి ఒక్క చాన్స్ ఇవ్వాలని అడుగుతున్నారని...పదిమంది కార్యకర్తలు కూడా చంద్రబాబు వెంట రావడం లేదని..మానసిక రుగ్మతతో చంద్రబాబు మాట్లాడుతున్నారు.. అంటూ చంద్రబాబు పరువు తీసేశారు పేర్ని నాని.

మరింత సమాచారం తెలుసుకోండి: