దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో పరిస్థితులు రోజురోజుకీ దారుణంగా  మారిపోతున్నాయి.  మొదటి రకం వైరస్ తో పోల్చి చూస్తే రెండవరకం వైరస్ శరవేగంగా విస్తరిస్తూ అందరిపై పంజా విసురుతోంది. ఈ క్రమంలోనే ఎంతోమంది ఆసుపత్రుల పాలవుతున్నారు. అయితే వైరస్ పట్ల ప్రతి ఒక్కరికీ అవగాహన ఉన్నప్పుటికీ ఏదో ఒక విధంగా ఈ మహమ్మారి వైరస్ మాత్రం పంజా విసురుతోంది.  ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ వైరస్ పంజా నుంచి మాత్రం తప్పించుకోలేక పోతున్నారు. ఈ క్రమంలోనే దేశంలో రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతోంది.


 అయితే దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోవడమే కాదు అటు  వైరస్ మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరిగి పోతూ ఉండటం భయాందోళనకు గురిచేస్తుంది.  అయితే కరోనా వైరస్ మరణాలలో ఎంతో మంది యువతలతో పాటు వృద్ధులు కూడా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఏ వయసు వారిపై  వైరస్ ప్రభావం ఎక్కువగా చూపుతుంది అన్నది కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికి కూడా ఎంతో మంది వృద్ధులు సైతం  వైరస్ సోకినప్పటికీ మనోధైర్యంతో ఈ మహమ్మారి వైరస్ ను జయిస్తున్న ఉండటం అందరిలో ధైర్యం నింపుతుంది.



 ఇటీవలే గాంధీ ఆసుపత్రిలో ఒక 110 ఏళ్ల వృద్ధుడు కరోనా వైరస్ జయించడం అందరిలో దైర్యం నింపింది  తెలంగాణ రాష్ట్రంలోని గాంధీ ఆసుపత్రిలో ఒక అద్భుతం జరిగింది. ఏకంగా నూట పదేళ్ళ వయసుగల వృద్ధుడు వైరస్ భారీ నుండి కోరుకున్నారు. రామానంద తీర్థ అనే వ్యక్తి మనోధైర్యం కోల్పోకుండా వైరస్ తో పోరాడి ఇక ఈ రక్కసిని జయించాడు. వైద్యుల సలహా మేరకు గాంధీ ఆసుపత్రిలో చేరిన ఆయన దాదాపు మూడు వారాల పాటు  వైరస్ తో పోరాడాడు.చివరికి ఈ మహమ్మారి వైరస్ ను జయించాడు. ఇటీవలే ఆయనకు  పరీక్ష చేయగా రిపోర్టులో నెగిటివ్ వచ్చింది అయితే అతనికి ఎలాంటి ఇతర జబ్బులు లేకపోవడం వల్లే ఇది సాధ్యమైంది అని చెబుతున్నారు వైద్యనిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: