
గత ఆర్థిక ఏడాది పన్నేతర ఆదాయం నిర్దేశించిన లక్ష్యంలో 76.92 శాతం రాగా, అంతకు ముందు ఆర్థిక సంవత్సరం 2021-22లో 28.99శాతం మాత్రమే వచ్చింద కాగ్ లెక్కలు తెలిపాయి. 2022-23 ఆర్థిక ఏడాదిలో రూ.1,26,606.04 కోట్లు పన్నులు వసూలు అవుతాయని రాష్ట్ర ప్రభుత్వ అంచనా వేస్తే మార్చి నాటికి వచ్చిన పన్నుల రాబడులను పరిశీలించిన కాగ్ రూ.1,26,617.09 కోట్లు మేర పన్నులు వసూలతో స్వల్పంగా పెరుగుదల నమోదు చేసి 100.01 శాతం వచ్చినట్లు తెలిపింది.
ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.42,189.47కోట్లు జిఎస్టీ ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా రూ.41,888.84 కోట్లు వసూలై లక్ష్యంలో 99.29శాతం సాధించిందని కాగ్ లెక్కలు తెలిపాయి. అదేవిధంగా స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ నుంచి రూ.15,600 కోట్లు మేర రాబడి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తే రూ.14,228.19 కోట్లు వచ్చి లక్ష్యంలో 91.21శాతం మేర సాధించింది. అమ్మకపు పన్ను ద్వారా రూ.33,000 కోట్లు రాబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తే 29,604.21 కోట్లు సాధించి లక్ష్య నిర్దేశనలో 89.71 శాతానికే పరిమితమైంది.
మద్యంపై విధించిన రాష్ట్ర ఎక్సైజ్ సుంకం రూ.17,500 కోట్లు ఆదాయం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయగా అంతకు మించి రూ.18,470 కోట్లు రాబడి వచ్చి నిర్దేశించిన లక్ష్యం కంటే 5.55శాతం అధికంగా వచ్చింది. కేంద్ర పన్నుల వాటా కింద రాష్ట్రానికి 12,407.64 కోట్లు మేర వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తే రూ.13,994.87 కోట్లు వచ్చి...12.79శాతం అధికంగా వచ్చినట్లు కాగ్ చెప్పింది.