ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటి దేశంలో అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా అన్ని పార్టీలు పావులు కదుపుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఓటర్ మహాశయులను ఆకట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి ఆయా పార్టీలు. ఇక ఎప్పుడూ జనాల్లో కనిపించని నేతలు ఇక ఇప్పుడూ జనం మధ్య ఉంటూ తాము ప్రజల మనిషిని అని చెప్పుకునేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. తాము గెలిస్తే ఏం చేస్తాము అనే విషయంపై తెగ హామీలు కురిపిస్తున్నారు నేతలు.


 అయితే ఇప్పటికే కేంద్రంలో రెండుసార్లు ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోడీ ఇప్పుడు మూడోసారి ప్రమాణస్వీకారం చేయాలని ఆశతో ఉన్నారు. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని మోడీ బలంగా నమ్ముతూ ఉన్నారు. అయితే మోడీ అభిమానులు కూడా ఇక ఆయన హ్యాట్రిక్ కొడితే చూడాలని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే సాధారణంగా తమ అభిమాన నాయకుడు ఎన్నికల్లో విజయం సాధించాలని ఫ్యాన్స్ అందరు కూడా ప్రత్యేక పూజలు చేయడం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడొక మోడీఅభిమన్ చేసిన పని మాత్రం అందరిని అవాక్కయ్యేలా చేస్తుంది.


 కేంద్రంలో ప్రధాన నరేంద్ర మోడీ మూడోసారి గెలిచి ప్రమాణస్వీకారం చేయాలని ఆకాంక్షిస్తూ అరుణ్ అనే ఒక అభిమాని తన చూపుడువేలును కాళీమాతకు బలిదానం ఇచ్చాడు. తర్వాత రక్తంతో ఆలయ గోడలపై.. మోడీ అందరికన్నా గొప్పవారు నువ్వు ఆయనను గెలిపించాలి కాళీమాత అని కొటేషన్ కూడా రాసాడు. ఈ ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. కాగా అతను తన ఇంట్లోనే మోడీకి గుడి కట్టి రోజు పూజలు కూడా చేస్తున్నాడు  అయితే నాయకుల పై అభిమానంతో ఇలా శరీరానికి గాయాలు చేసుకునే పిచ్చి పనులు చేయొద్దు అంటూ ఈ ఘటనపై ఎంతో మంది ఇంటర్నెట్ జనాలు స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: