అయితే ఇప్పటికే కేంద్రంలో రెండుసార్లు ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోడీ ఇప్పుడు మూడోసారి ప్రమాణస్వీకారం చేయాలని ఆశతో ఉన్నారు. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని మోడీ బలంగా నమ్ముతూ ఉన్నారు. అయితే మోడీ అభిమానులు కూడా ఇక ఆయన హ్యాట్రిక్ కొడితే చూడాలని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే సాధారణంగా తమ అభిమాన నాయకుడు ఎన్నికల్లో విజయం సాధించాలని ఫ్యాన్స్ అందరు కూడా ప్రత్యేక పూజలు చేయడం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడొక మోడీఅభిమన్ చేసిన పని మాత్రం అందరిని అవాక్కయ్యేలా చేస్తుంది.
కేంద్రంలో ప్రధాన నరేంద్ర మోడీ మూడోసారి గెలిచి ప్రమాణస్వీకారం చేయాలని ఆకాంక్షిస్తూ అరుణ్ అనే ఒక అభిమాని తన చూపుడువేలును కాళీమాతకు బలిదానం ఇచ్చాడు. తర్వాత రక్తంతో ఆలయ గోడలపై.. మోడీ అందరికన్నా గొప్పవారు నువ్వు ఆయనను గెలిపించాలి కాళీమాత అని కొటేషన్ కూడా రాసాడు. ఈ ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. కాగా అతను తన ఇంట్లోనే మోడీకి గుడి కట్టి రోజు పూజలు కూడా చేస్తున్నాడు అయితే నాయకుల పై అభిమానంతో ఇలా శరీరానికి గాయాలు చేసుకునే పిచ్చి పనులు చేయొద్దు అంటూ ఈ ఘటనపై ఎంతో మంది ఇంటర్నెట్ జనాలు స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.