ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ డేట్ దగ్గర పడటంతో రాష్ట్ర రాజకీయం ఊహించని మలుపులు తిరుగుతుంది. వైసీపీ నేత జగన్ చెప్పినట్లుగానే ఎన్నికల కురుక్షేత్రం జరగనుంది. అటు టీడీపీ, జనసేన, బీజేపీలు కూటములుగా ఏర్పడ్డాయి.దాంతో పాటు కాంగ్రెస్ కూడా వామపక్షాలతో కలిసి కూటమిగా ఏర్పడింది. కానీ వైసీపీ మాత్రం ఒంటరిగానే పోటీలోకి దిగుతుంది.జగన్ అన్న వదిలిన బాణాన్ని అని చెప్పిన సొంత చెల్లెలు షర్మిల ఈ సారి జగన్ కు వ్యతిరేకంగా నిలబడటంతో ఈ సారి రాజకీయం మరింతగా హీటెక్కింది. షర్మిల ఇప్పటివరకు జగన్ పై ఎన్నో ఆరోపణలు చేసింది..రాష్ట్రం అంతా జోరుగా ప్రచారం చేస్తోంది. ప్రత్యర్థులకు ధీటుగా సమాధానం ఇస్తుంది.అయితే ప్రచారంలో దూసుకుపోతున్న షర్మిలకు కోలుకోలేని షాక్ తగిలింది.ప్రస్తుతం షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తుంది.. ఈ క్రమంలో ఆమె తాజాగా  ప్రచారం నిర్వహించారు. అయితే ఆమె ప్రచారం చేస్తున్న సమయంలో ఆమె వాహనాన్ని కొందరు అడ్డుకున్నారు. తమ వాహనాలకు చెల్లించాల్సిన అద్దె రూ.6 లక్షలు ఇవ్వాలంటూ ఆమెతో గొడవ పడ్డారు. అయితే వారికి ఎలాగోలా సర్ది చెప్పి అక్కడి నుంచి పంపివేశారు.

అలాగే ఆమె ప్రచారాన్ని బెనీటమైన్స్ బాధితులు అడ్డుకున్నారు. అయితే తనకు బెనీటమైన్స్ తో సంబంధం లేదని చెప్పి అక్కడి నుంచి షర్మిల వెళ్లిపోయింది.అయితే ఆమె వారికి సరైన సమాధానం చెప్పుకుండానే వెళ్లిపోయింది.దీనితో ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి..ఇదిలా ఉంటే ఆమె సోదరి సునీతకు కోర్టులో మరో షాక్ తగిలింది. ప్రచారంలో వైఎస్ వివేకానంద హత్య గురించి మాట్లాడొద్దంటూ ఇప్పటికే కడప కోర్టు హెచ్చరించింది.. అయితే దాన్ని సవాల్ చేస్తూ వారిద్దరూ  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఈ కేసును కడప కోర్టులోనే తేల్చుకోవాలంటూ హై కోర్టు ఆర్డర్ వేసింది. దాంతో వారిద్దరూ మరోసారి కడప కోర్టునే ఆశ్రయించారు. ఈ విషయంపై మరోసారి విచారణ జరిపిన కోర్టు వారిద్దరికీ మరోసారి ఊహించని షాక్ ఇచ్చింది. తప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి వారిద్దరికీ రూ.10వేల ఫైన్ విధించింది. షర్మిలకు ఇలా వరుసగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: