
అయితే ఈ సంఘటన జరిగిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితోపాటుగా అధికారులు సహాయక చర్యలు కూడా చేపట్టడం జరిగింది. అలాగే హోమ్ మినిస్టర్ అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ తో పాటు పలువురు సహాయక చర్యలు ఈ సంఘటన స్థలానికి చేరుకొని పర్యావేక్షిస్తున్నారు. ఏడు మంది మృతి దేహాలను విశాఖ కేజీహెచ్ కు తరలించారు.అయితే గాయపడిన వారిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా కలెక్టర్ తెలియజేయడం జరిగింది. నరసింహస్వామి నిజస్వరూపం దర్శించుకునేందుకు భారీ ఎత్తున సింహగిరికి భక్తులు వెళ్లారు. ఇంకా శిధిలాల కింద మరికొంతమంది ఉండవచ్చు అని అనుమానంతో పదికి పైగా అంబులెన్స్లను అక్కడ ఉంచారట.
వేకువజామున ఒంటిగంటకు స్వామివారిని సుప్రభాత సేవలో పాల్గొనాలని ఆ వెంటనే స్వామి వారి నిజస్వరూపాన్ని విశేష అభిషేకాలతో నిర్వహిస్తారు. స్వామివారి నిజస్వరూపాన్ని సైతం దర్శించుకోవాలని వెళ్లిన భక్తులు ఈ సంఘటన జరగడంతో అక్కడ భక్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సుమారుగా రెండు లక్షల మంది భక్తులు సింహాద్రి అప్పన్న దర్శనం కోసం వచ్చారట. కుండపోతు వాన రావడంతో ఈ గోడ కూలిపోవడంతో అప్పన్న సన్నిధిలో ఈ విషాదం సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. మరి కొన్ని గంటలలో మృతుల వివరాలు తెలియజేస్తారేమో చూడాలి.