తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఏఈఓ) గా విధులు నిర్వర్తిస్తున్న ఏ. రాజశేఖర్ బాబు పై సస్పెన్షన్ వేటు పడింది . తిరుపతి జిల్లా పుత్తూరు కు చెందిన ఆయన , టీటీడీ నిబంధనల కు విరుద్ధంగా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యం లో, ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారికంగా ప్రకటించింది. రాజశేఖర్ బాబు ప్రతి ఆదివారం స్థానికం గా ఉన్న ఓ క్రైస్తవ ప్రార్థనా మందిరంలో పాల్గొంటున్నారన్న సమాచారం స్థానిక భక్తుల ద్వారా టీటీడీ విజిలెన్స్ అధికారులకు చేరింది . దీనిపై విచారణ చేపట్టిన విజిలెన్స్ విభాగం , ఆరోపణలన్నీ నిజమేనని నిర్ధారించింది . అనంతరం ఈ అంశాన్ని టీటీడీ ఈవో శ్యామలరావు దృష్టి కి తీసుకెళ్లింది .


విజిలెన్స్ నివేదికను పరిశీలించిన ఈవో (ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) శ్యామలరావు , శాఖాపరమైన చర్యల తో పాటు వెంటనే సస్పెండ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ : “హిందూ ధార్మిక సంస్థ అయిన టీటీడీ లో పని చేసే ఉద్యోగులు సంస్థ నియమాలను పాటించడం కచ్చితంగా ఉండాలి . ఈ వ్యవహారంలో రాజశేఖర్ బాబు ప్రవర్తన టీటీడీ ఆచరణ నియమాల కు విరుద్ధమైంది . అందువల్ల ఆయన పై సస్పెన్షన్ విధించడమైందని” ఈవో శ్యామలరావు స్పష్టం చేశారు . టీటీడీ ఉద్యోగ నిబంధనలు - ధార్మిక పరిమితుల పై మరోసారి చర్చ : ఈ సంఘటన ద్వారా టీటీడీలో పని చేసే ఉద్యోగుల వ్యక్తిగత ఆచారాల పై మరోసారి చర్చ మొదలైంది . హిందూ ధార్మిక సంస్థ లో పనిచేస్తూ, ఇతర మత ప్రార్థనల్లో పాల్గొనడం పై నిబంధనలు ఏ మేరకు కఠినంగా ఉండాలి ? అన్న ప్రశ్నలు మళ్లీ తెరపైకి వచ్చాయి .

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: