ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని అభివృద్ధికి కేంద్రం సహాయం అందిస్తుందని సీఎం చంద్రబాబు కూడా ఎన్నో సందర్భాలలో తెలియజేశారు. కూటమిలో భాగంగా కూడా ఆయన తాను రాజధాని నిర్మిస్తాను అంటూ ఎన్నికల ముందు తెలియజేశారు. అన్నట్టుగానే అధికారం చేపట్టిన తర్వాత అన్ని పనులు రాజధాని అమరావతి నుంచే చేస్తున్నారు.వాస్తవంగా అమరావతి రాజధానికి 45 వేల కోట్ల రూపాయలు అప్పు ఉందనే విధంగా వినిపిస్తున్నాయి. ఏడిపి ఆషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్, హట్కో ఇచ్చింది. అయితే అదంతా డబ్బులు కట్టక్కర్లేదు.. అది కేంద్రమే కడుతుందనే కదా బిజెపి నేత పురందేశ్వరి గారు చెప్పింది. అప్పుడు చంద్రబాబు కూడా చెప్పింది ఇదే కదా. అది ఒక రకంగా గ్రాంట్ లాంటిదే అని చెప్పారు.. అలాగే మరొకవైపున హైవే  కేంద్రమే కడుతుంది కదా లింక్డ్ అంటూ తెలిపారు..అలాగే ఇన్నర రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్డు కూడా కేంద్రమే కడుతుంది. సుమారుగా లక్ష కోట్ల రూపాయలు ఖర్చుపెడుతుందని గతంలో తెలియజేశారు.


అయితే ఇన్ని చేసినా కూడా ఆ పేరు బిజెపికి వెళ్తుందా? అంటే వెళ్లడం లేదు.. బిజెపి కూడా వీటికి సంబంధించి ప్రచారం చేసుకోలేదు. గతంలో పురందేశ్వరి గారు ఈ ఒక్క ముక్క చెప్పారు. ఇక తర్వాత పట్టించుకోలేదు.  ఇప్పుడు 79,280 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అమరావతికి గ్రాంట్ ఇవ్వండి అంటూ సీఎం చంద్రబాబు అడిగారట. కానీ ఇంత ఇవ్వమని చంద్రబాబు అడగలేదు గ్రాంట్ ఏదైనా ఇవ్వండి అని అడిగారట.



ఇదివరకు ఆల్రెడీ మూడున్నర వేల కోట్ల రూపాయలు ఇచ్చింది. ప్లస్ ఇవన్నీ కూడా ఇచ్చారు. మరి ఇప్పుడు ఒకవేళ ఇస్తే చంద్రబాబు గారికి పేరు.. ఇవ్వకపోతే భవిష్యత్తులో అదిగో అమరావతిని కేంద్రం మోసం చేస్తోంది అంటూ గొడవకు దిగుతారు. మరి కూటమిలో బిజెపికి ఒక పరీక్ష అని చెప్పవచ్చు. అమరావతికి మరి ఎంజరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: