ఒకరోజు మల్లయ్య ను పిలిచి నువ్వు పని చేయకుండా ఇలా ఎంతకాలం ఉంటావు? మేము ఉన్నంత కాలం ఏదో విధంగా నిన్ను పోషిస్తాము. మేము పెద్ద వాళ్ళం వయసు మీద పడుతోంది. కొంతకాలానికి మేము చనిపోక తప్పదు. ఆ తరువాత నువ్వు ఎలా బతుకుతావు? ప్రతి మనిషి బ్రతకడానికి ఏదో ఒక పని చేసుకోవాలి..లేకపోతే బతకలేం. నువ్వు కూడా ఏదో ఒక పని చేసుకో అని నచ్చచెప్పారు. తల్లిదండ్రుల ఒత్తిడి తో మల్లయ్య "సరే మీరే చెప్పండి ఏం పని చెయ్యాలో"అని అడిగాడు "అడవికి వెళ్లి కట్టెలు తీసుకునిరా"అని చెప్పారు అతని తల్లిదండ్రులు.
మల్లయ్య ఒకరోజు ఉదయాన్నే లేచి కట్టెల కోసం అడవికి వెళ్ళాడు.కొంత సేపు అడవిలో అటు ఇటు తిరిగాడు పని అలవాటు లేక మల్లయ్యకు కట్టెలు ఎలా కొట్టాలో తెలియలేదు. ఒక చెట్టు కింద కూర్చుని ఆలోచించసాగాడు. చల్లటి గాలికి అతడికి గాఢనిద్ర వచ్చింది. కొంతసేపటికి అతడు ఉన్నచోట చెట్టునీడ పోయి ఎండ వచ్చింది. కానీ మల్లయ్య ఉన్న చోటనే ఉండి పోయాడు. ఎండ వచ్చి మీదపడుతున్న కూడా అక్కడినుంచి కదలకుండా బద్ధకంగా ఉండిపోయాడు. ఎండను తెచ్చిన సూర్యుడు నీడను ఇవ్వకపోతాడా? అనుకుంటూ ఎదురుచూశాడు. కొంతసేపటికి ఒక సింహం తన వైపుకు రావడాన్ని మల్లయ్య గ్రహించాడు. కానీ అప్పుడు కూడా లేవలేదు.
ఆ బద్దకస్తుడు సింహం నా మీదకు ఎందుకు వస్తుంది. పక్కనుంచి పోతుందిలే అనుకుంటూ అలాగే ఉండిపోయాడు.అప్పుడే అటువైపుగా వస్తున్న వేటగాడు... మల్లయ్య మీదకు సింహం రావడాన్ని గ్రహించాడు. వెంటనే తన వద్దనున్న తుపాకీతో గాలిలోకి కాల్చి సింహాన్ని పారిపోయేటట్లు చేసి మల్లయ్యను సింహం బారినుంచి కాపాడాడు. బుద్ధి తెచ్చుకున్న మల్లయ్య ఇంకెప్పుడూ బద్దకాన్ని దరిచేరనీయకూడదు. అనుకొని ఆ వేటగాడికి కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే కట్టెలు ఎలా కొట్టాలో నేర్చుకున్నాడు. అడవి నుంచి కట్టెలు కొట్టుకుని ఇంటికి వెళ్ళాడు. జరిగిందంతా తన తల్లిదండ్రులకు చెప్పాడు. తాను ఇకనుంచి అలాగే పని చేసుకుంటానని చెప్పాడు. మల్లయ్యలో వచ్చిన మార్పుకు తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు.