ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన టీం ఇండియా అక్కడ టెస్ట్ వన్డే సిరీస్లో ఓడిపోయి తీవ్రంగా నిరాశపర్చింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరికొన్ని రోజుల్లో అటు వెస్టిండీస్తో స్వదేశంలో వరుస సిరీస్ లు ఆడబోతుంది.  వన్డే టి20 సిరీస్ ఆడబోతుంది. ఫిబ్రవరి ఆరో తేదీ నుంచి భారత్ వెస్టిండీస్  మధ్య పోరు ప్రారంభం కాబోతుంది అనేది తెలుస్తుంది. అయితే మొన్నటి వరకూ గాయం కారణంగా సౌత్ ఆఫ్రికా పర్యటనకు దూరమైన రోహిత్ శర్మ మళ్లీ జట్టులోకి రీ-ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇక రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా జట్టును ఇటీవలే ప్రకటించింది బిసిసిఐ. సోషల్ మీడియా వేదికగా ఈ వివరాలను వెల్లడించింది.



 అయితే బీసీసీఐ ప్రకటించిన వన్డే టీ 20 జట్టు లో ఎంతో మంది యువ ఆటగాళ్లకు స్థానం కల్పించినట్లు తెలుస్తోంది. ఇలా బిసిసిఐ ప్రకటించిన జట్టులో ఎన్నో రోజుల పాటు అటు దూరంగా ఉన్న చైనా మన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ కు స్థానం దక్కడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి. గాయం బారినపడి క్రికెట్కు దూరమైన కుల్దీప్ యాదవ్ కు బిసిసీఐ సెలెక్టర్లు జట్టులో ఎలా స్థానం కల్పించారు అన్నదే ప్రస్తుతం ప్రధానంగా చర్చ జరుగుతూ ఉండటం గమనార్హం. ఈ విషయంపై ఎంతోమంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై భారత మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 ఎలాంటి మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా బరిలోకి దిగడం కుల్దీప్ కు ఎంతో కష్టతరంగా మారిపోతుంది అంటూ హర్భజన్ సింగ్  వ్యాఖ్యానించాడు. గత ఏడాది ఐపిఎల్ సందర్భంగా గాయపడిన కుల్దీప్ ముందు ఉన్నదంతా కఠినమైన మార్గం అంటూ హర్భజన్ తెలిపాడు. గాయం బారినపడి దూరమైన కుల్దీప్ గత కొంతకాలంగా దేశవాళీ మ్యాచ్లు కూడా ఆడలేదు. ఏ క్రికెట్ మ్యాచ్ ఆడకుండా అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేయడం అంత సులువైనది కాదు. మోకాలికి శస్త్ర చికిత్స చేసుకోవడానికి ముందు కూడా అతను అంతర్జాతీయ క్రికెట్ లో క్రమంగా ఆడలేదు. అయితే ఇక పరిమిత ఓవర్ల క్రికెట్లో పునరాగమనం చేస్తున్న బౌలర్ ప్రతిఒక్కరి మదిలో ఒక ఆలోచన ఉంటుంది. నా బౌలింగ్ లో  బ్యాట్స్మెన్లు చితక్కొట్టకూడదు అని ఉంటుంది. ఇక ఇప్పుడు కుల్దీప్ యాదవ్ మానసిక దృఢత్వానికి ఇది ఒక పరీక్ష లాంటిది అంటూ చెప్పుకొచ్చాడు హార్భజన్ సింగ్.

మరింత సమాచారం తెలుసుకోండి: