ఎవరు నమ్మలేని విషయం ఏమిటంటే 2019 ప్రపంచకప్ తర్వాత టీమిండియా తరఫున మూడు ఫార్మాట్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు విరాట్ కోహ్లీ కావడం గమనార్హం. సెంచరీ చేయకపోయినా అత్యధిక పరుగుల జాబితాలో టాప్ లోనే ఉన్నాడు. ఇప్పటివరకు 2019 ప్రపంచకప్ తర్వాత 83 మ్యాచ్ లు ఆడాడు. 3524 పరుగులతో టాప్ లో ఉన్నాడు. రోహిత్ శర్మ 70 మ్యాచ్ల్లో 3318 పరుగులు చేసి రెండవ స్థానంలో ఉన్నాడు. రిషబ్ పంత్ 75 మ్యాచ్ లలో 2593 పరుగులు, కేఎల్ రాహుల్ 57 మ్యాచ్ లలో 2524 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 64 మ్యాచ్ లలో 2124 పరుగులు సాధించి తర్వాత స్థానాల్లో ఉన్నారు.
ఈ గణాంకాలు చూసుకుంటే కోహ్లీ మరీ అంత బ్యాడ్ ఫామ్ లో లేడు అని అర్థమవుతుంది. కానీ అతని పై విమర్శలు వస్తున్నాయి. దీనికి కారణం అంతకు ముందు విరాట్ కోహ్లీ భీకరమైన ఫామ్ లో ఉండటమే. మూడేళ్ల నుంచి సెంచరీ చేయకపోవడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ఐపీఎల్ ద్వారా కోహ్లీ పై మరింత ఒత్తిడి పెరిగింది. ఓ మోస్తారు పరుగులు కూడా రాబట్ట లేకపోతున్నాడు. దీంతో విమర్శకులకు ఇదే అదునుగా మారి కోహ్లీని వేలెత్తి చూపుతున్నారు. కోహ్లీ ఇటీవలే విశ్రాంతి కూడా ప్రకటించారు సెలెక్టర్లు. ఏది ఏమైనా కోహ్లీ అంత బ్యాడ్ ఫామ్లో ఉన్నాడని విమర్శలు చేస్తున్నా గణాంకాలు మాత్రం విరాట్ కోహ్లీనే టాప్ బ్యాట్స్మెన్ అన్నది చెప్పకనే చెబుతున్నాయ్ అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి