ఈ మధ్యకాలంలో ఎంతోమంది ప్రేమోన్మాధులు రెచ్చిపోతున్నారు. ఎంతోమంది యువతుల జీవితాలను నాశనం చేస్తున్నారు. ఏకంగా ప్రేమ పేరుతో నటించి మోసం చేస్తున్నారు. ఒకవేళ అమ్మాయిలు ప్రేమకు అంగీకరించలేదు అంటే చాలు ఏకంగా యాసిడ్ పోసి రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్న ఘటనలు కూడా చాలానే వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఉలిక్కిపడుతున్నారు. ఇక ఆడపిల్ల గడప దాటి బయటికి వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొంది.


 అయితే ఇలా అమ్మాయిలపై అబ్బాయిలు దాడి చేయడం దారుణంగా ప్రవర్తించడం లాంటిది మొన్నటి వరకు ఇక ఇప్పుడు అమ్మాయిలు కూడా అబ్బాయిల్లా మారిపోయారు. ఏకంగా పెళ్లికి ఒప్పుకోకపోతే, ప్రేమను అంగీకరించకపోతే ఏకంగా అబ్బాయిల పైన సైతం దాడి చేస్తూ ఉన్న అమ్మాయిలను చాలామందిని చూస్తూ ఉన్నామ్. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఏకంగా పెళ్లికి అంగీకరించలేదు అన్న కారణంతో ఒక యువకుడి పై యువతి యాసిడ్ పోసింది. ఈ ఘటన అందరిని షాక్ కి గురిచేస్తుంది అని చెప్పాలి. బీహార్ లోని వైశాలి జిల్లాలో వెలుగు చూసింది ఈ దారుణ ఘటన.


 తనతో పెళ్లికి ఒప్పుకోలేదు అన్న కారణంతో 22 ఏళ్ళ యువకుడి పై 24 ఏళ్ల యువతి యాసిడ్ పోసి దాడి చేసింది. దీంతో యువకుడి ముఖం మొత్తం కాలిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. కాగా బాధితుడు ధర్మేంద్ర కుమార్ గా పోలీసులు గుర్తించగా అతనికి ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఇక ఇలా దాడి చేసిన యువకుడు అరెస్టు చేసామని పోలీసులు తెలిపారు. అయితే ఆ ఇద్దరికీ కూడా ముందు నుంచే పరిచయం ఉన్నట్లు పోలీసు విచారణలో తేలిందని చెప్పుకొచ్చారు. 

ఈ ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది. ఈ విషయం తెలిసి మొన్నటి వరకు అబ్బాయిలే అనుకున్నాం అమ్మాయిలు కూడా మరి ఇలా తయారైతే ఎలా అని నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: