ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఇండియాలో జరుగుతున్న క్రికెట్ పండుగ గురించి మాట్లాడుకుంటున్నారు అందరూ. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతూ ప్రేక్షకులందరికీ అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ పంచుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. చివరి బంతి వరకు కూడా ఎవరు గెలుస్తారు అనేది తెలియకుండా.. ఇక ఉత్కంఠగా సాగుతున్న మ్యాచ్లు ఇక ప్రేక్షకులందరినీ టీవీలకు అతుక్కుపోయేలా చేస్తూ ఉన్నాయి.


 అయితే క్రికెట్ మ్యాచ్ అంటే చాలు సాధారణంగా ఇక మైదానంలో బరిలోకి దిగి సిక్సర్లు ఫోర్లు కొట్టే బ్యాట్స్మెన్లు అదిరిపోయే బంతులు వేస్తూ ఆశ్చర్యపరిచే బౌలర్లు.. ఇక ఫీల్డింగ్ లో విన్యాసాలు చేసే ఆటగాళ్లు మాత్రమే గుర్తుకు వస్తూ ఉంటారు. కానీ సిక్సర్ కొట్టినప్పుడు ఆ సిక్సర్ అసలు సిసలైన ఫీలింగ్ వచ్చేలా చేసే కామెంటేటర్లు మాత్రం చాలా తక్కువగా గుర్తుకు వస్తూ ఉంటారు. కామెంటేటర్లు లేకపోతే అటు మైదానంలో జరిగే క్రికెట్ మ్యాచ్ కూడా మూకీ డ్రామాగా ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇలా మ్యాచ్ ను మరింత ఉత్కంఠ భరితంగా.. ఎంటర్టైనింగ్ గా మార్చే కామెంటేటర్లు కొన్ని కొన్ని సార్లు నోరు జారడం చేస్తూ ఉంటారు.


 ఇలా ఎవరైనా  వ్యాఖ్యాత నోరు జారారు అంటే చాలు వారిపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఇలాంటి విమర్శలను ఎదుర్కొంటున్నాడు కామంటేటర్ మురళి కార్తీక్. ఇటీవల పంజాబీ కింగ్స్, బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో యష్ దయాల్ పై మురళీ కార్తీక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒకరి చెత్త మరొకరికి నిధిలా మారుతుంది అంటూ కామెంట్ చేశాడు. అతను చేసిన కామెంట్ కాస్త సంచలనంగా మారిపోయింది. అయితే ఇక ఈ కామెంట్ పై స్పందించిన ఆర్సిబి అవును అతను మా నిధి అంటూ రిప్లై ఇవ్వడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: