ఈ రోజున ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ లోని కంటెస్టెంట్ లు చాలా సరదాగా ఎంజాయ్ చేసినట్లుగా కనిపిస్తోంది.. ప్రేక్షకులను ఎంటర్ టైన్ మెంట్ చేసేందుకు కొన్ని టాస్క్ లు కూడా చేశారు. ఇందులో భాగంగా అఖిల్ ఒక తాగుబోతు క్యారెక్టర్ లో ఎంటర్టైన్మెంట్ చేయడం జరిగింది. దాంతో బిగ్ బాస్ లో పాల్గొన్న బిందుమాధవి ని అతను టార్గెట్ చేయడం జరిగింది. నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నా జీవితం సంకనాకి పోయింది అని కామెంట్ చేశాడు అఖిల్. ఈ విషయాలు చెప్పడంతో అక్కడున్న వారందరూ తెగ నవ్వుకున్నారు.
ఇక అంతే కాకుండా నిన్ను ప్రేమించినందుకు తనని తాను కొట్టుకోవాలని.. నువ్వు మోసం చేసి పోయినప్పటికీ కూడా బిందుమాధవి అంటే తనకు ఇష్టమని అఖిల్ ఎంతో ఎమోషనల్ తో తెలియజేశారు. ఇది చూసిన వారు రియల్ గానే వీరిద్దరు మధ్య ఏదో ఉన్నట్లూ గా మెప్పించారు అఖిల్. దీంతో ఇప్పుడు ప్రేక్షకులు బుల్లితెర వర్గాల్లో వారంతా కూడా ఈ ఎపిసోడ్ కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక బిందుమాధవి కూడా అఖిల్ తో కలిసి బాగా ఎంటర్టైన్మెంట్ చేసినట్లుగా కనిపిస్తోంది. వీరిద్దరికి మొన్నటివరకు అస్సలు పడేది కాదు ఇప్పుడు పరిస్థితి చాలా మారిపోయింది.. ఇద్దరు చాలా క్లోజ్ అయ్యారు ఒకరినొకరు చాలా స్ట్రాంగ్ గా మార్చుకున్నారు.. మరి ఈ వ్యవహారం ఎంత దూరం వెళుతుందో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి