సాధారణం గా అడవిలో జీవించే ఖడ్గ మృగాలు సింహాలు పులులు లాంటి జీవులను జంతు ప్రదర్శన శాలలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. లేదంటే యానిమల్ ప్లానెట్ ఛానల్ లో కూడా ఎక్కువగా వీటిని చూడటం చేస్తూ  ఉంటాము అన్న విషయం తెలిసిందే. కానీ ఇలాంటి ప్రమాద కరమైన జంతువులు జనావాసాల్లోకి వస్తే మాత్రం ప్రతి ఒక్కరి వెన్ను లో వణుకు పుడుతూ ఉంటుంది. ఇక్కడ తమపై దాడి చేసి ప్రాణాలు తీసేస్తుందో అని అందరూ భయపడి పోతుంటారు అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. ఇక ఇటీవల కాలం లో ఇలాంటి తరహా ఘటనలు చాలానే వెలుగు లోకి వస్తున్నాయి అనే విషయం తెలిసిందే.


  అడవులను నరికివేసి ఎంతోమంది ఇక పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తున్న నేపథ్యం లో అడవుల్లో ఉండే జంతువులు ఇక ఇప్పుడు జనావాసాల్లోకి వస్తూ ఉండటం చూస్తూ ఉన్నాము. గత కొంత కాలం నుంచి తరచూ జనావాసాల్లో చిరుత పులులు సంచరిస్తున్నాయి.. ఎలుగు బంట్లు దాడి చేస్తున్నాయని  ఇలా ఎన్నో వార్తలు తెరమీదికి వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వార్త ఒకటి వైరల్ గా మారి పోయింది. ఏకంగా ఖడ్గమృగం జనావాసాల్లోకి వచ్చేసింది.


 రద్దీగా ఉండే పట్టణంలో ఏకంగా ఒక ఖడ్గమృగం దర్జాగా నడుస్తూ ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ఇటీవలే ఒక ఐఎఫ్ఎస్ అధికారి ఈ వీడియోని ట్విట్టర్ వేదికగా షేర్ చేసి ఇక ఎప్పుడైనా ఖడ్గమృగం మనుషులు ఆవాసాల్లో సంచరించినప్పుడు  దాని పట్ల  ఎవరూ భయం గందరగోళానికి గురి కావొద్దు అంటూ ఒక వ్యాఖ్యను వీడియో కి జోడించాడు. కాగా రద్దీగా ఉండే నగరంలో ఖడ్గమృగం రోడ్డు పై పరుగులు పెడుతూన్న వీడియో అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: