రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలకు గద్దర్ అనే పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన పాటలు ఆయన పాటలు ప్రతి ఒక్కరికి గుర్తుకు వస్తాయి. ఉద్యమం అంటే చాలు అక్కడ గద్దర్ కచ్చితంగా పాట పాడాల్సిందే అనేంతల తన పేరును పాపులారిటీ చేసుకున్నారు. అంతలా ప్రజా జీవితంలో మమేకమైన గద్దర్ గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో హాస్పిటల్ లోకి చేరినట్టుగా తెలుస్తోంది. గద్దర్ హైదరాబాదులోని అపోలో ఆసుపత్రికి గత రెండు రోజుల క్రితం గుండె ఆపరేషన్ కోసం చేరినట్టుగా సమాచారం.


అనంతరం గుండె ఆపరేషన్ కూడా జరిగిందని అంతా బాగానే ఉందని వైద్యులు కుటుంబ సభ్యులు సైతం తెలియజేసినట్లు సమాచారం. అయితే అలాంటి గద్దర్ ఒకసారిగా మరణించాలనే వార్త తెలియజేసి అందరికీ షాక్ గురి చేశారు. అసలు గద్దర్ మరణించడానికి గల కారణాలను డాక్టర్లు సైతం తమ మాటలను తెలియజేసినట్టు తెలుస్తోంది. వైద్యులు తెలియజేస్తూ గద్దర్ గుండె ఆపరేషన్ తర్వాత కోలుకున్నారని అయితే ఈ రోజున ఉదయం తెల్లవారుజామున ఆయనకు ఒక్కసారిగా బిపి బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోయింది అని.


బీపీని కంట్రోల్ చేసే సమయంలో అతని సుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పడిపోయాయి ఒకవైపు బీబీ పెరగడం మరొకవైపు షుగర్ లెవలు తగ్గిపోవడంతో ఆయన శరీరం చికిత్సకు సహకరించలేదని తెలిపారు..ఇదే సమయంలో అతని శరీరంలోని పలు అవయవాలు కూడా స్పందించడం మానేశాయని ముఖ్యంగా కిడ్నీ, లివర్ పనిచేయడం మందగించిందని ఇలాంటి క్రమంలోనే 12 గంటలలోనే మల్టీ ఆర్గానిక్ ఫెయిల్ అయి ఈ రోజున మధ్యాహ్నం గద్దర్ కన్నుమూశారని తెలియజేశారు. అయితే గద్దర్ మరణ వార్త విని ఆయన అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాలలోని నాయకులు సైతం ఈయన ఆత్మకు శాంతి చేకూరాలని తెలియజేస్తున్నారు. గద్దర్ లేరని తెలిసి పలువురు అభిమానులు కూడా తీవ్ర శోకసముద్రంలోకి మునిగిపోయారు. ప్రస్తుతం ఆయన జ్ఞాపకాలను అభిమానుల సైతం నెమరు వేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: