తెలంగాణలో ఎన్నికలవేళ ప్రజలు ఆనందంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఓట్లు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈరోజు ఉదయం 7 గంటలకు మొదలైన ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ సెంటర్ల వద్ద భారీగా భారులు తీరులుగా ఉన్నట్లు తెలుస్తోంది. మరికొన్ని ప్రాంతాలలో చాలా ఉద్రిక్తత పరిస్థితి కూడా నెలకొంది. ముఖ్యంగా సీఎం కేసీఆర్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కామారెడ్డి జిల్లాలో కూడా చాలా హై టెన్షన్ వాతావరణ ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది.



పలువురు కాంగ్రెస్ నేతల పైన కూడా పోటీగా నినాదాలు చేయడంతో అక్కడ పరిస్థితులు చాలా ఉధృత నెలకొంటుంది. అంతేకాకుండా హైదరాబాద్ టు విజయవాడ హైవే పైన భారీ రద్దీ ఏర్పడినట్లు తెలుస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు మీద సమీపంలో పెద్ద ఎత్తున వాహనాలు సైతం ఆగిపోయాయని ఓటు వినియోగించుకునే అందుకే ప్రజలు కూడా రాకపోకలు సాగిస్తూ ఉండడంతో ఈ రద్దు ఏర్పడినట్లు పోలీసులు సైతం తెలియజేస్తున్నారు. తెలంగాణలో పలు ప్రాంతాలలో బస్టాండులు కూడా చాలా ప్రజలతో కిక్కిరిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఉదయం7 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ శాతం ఎంత నమోదయిందని విషయానికి వస్తే..51.89 శాతం మాత్రమే పోలింగ్ అయినట్లుగా అధికారుల సైతం వెల్లడించారు. అయితే ఇప్పటివరకు అత్యధికంగా మెదక్ జిల్లాలో 70% వరకు పోలింగ్ అయినట్లుగా సమాచారం అత్యంత తక్కువగా హైదరాబాద్ జిల్లాలో 32 శాతం వరకు పోలింగ్ అయినట్లుగా అధికారులు సైతం వెల్లడించడం జరిగింది. మరి సాయంత్రానికి ఎంతవరకు చేరుతుందో చూడాలి మరి. తెలంగాణ పౌరులు ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కూడా పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజవర్గాలలో..2,290 మంది సైతం ఎన్నికలలో పోటీ చేస్తున్నారని తెలంగాణలో 33 జిల్లాలలో 119 మంది అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: