వాహన ప్రియులకు బెంజ్ కారు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఎవరికైతే ఈ వాహనం అందదో వారు ఆ వాహనం కొనడానికి తెగ ఆరాటపడుతుంటారు.. ఇకపోతే ఈ బెంజ్ కంపెనీ నుండి ఓ కొత్త కారును లాంచ్ చేశారు. బెంజ్ వీ-క్లాస్ కారు భారత్ మార్కెట్లో విడుదలై వాహన ప్రియులను ఆకట్టుకుంది. 

 

అయితే త్వరలోనే బెంజ్ నుంచి మరో సరికొత్త మోడల్ ను లాంచ్ చెయ్యనున్నారు. అది ఏంటి అంటే? బెంజ్ ఏ-క్లాస్ లిమోజైన్ సెడాన్. ఈ కొత్త మోడల్ ను జులైలో లాంచ్ చెయ్యనున్నారు. ఈ సంవత్సరం ఢిల్లీలో జరిగిన 2020 ఆటో ఎక్స్ పోలో ఏ-క్లాస్ లిమోజైన్ సెడాన్ వాహనాన్ని ఆవిష్కరించారు.. అయితే ఈ కారు బుక్కింగ్స్ తాజా ప్రారంభం అయ్యాయి. 

 

దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న డీలర్ల వద్ద ఈ కారు బుక్ చేసుకోవచ్చు. బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా మెర్సిడెజ్ బెంజ్ ఏ-క్లాస్ లిమోజైన్ సడెన్ ను రూపొందించారు. ఎక్స్ షోరూంలో ఈ కారు ప్రారంభ ధర రూ.40 లక్షలు ఉండనుంది అని సమాచారం. అయితే ప్రస్తుతం ఈ కారును బుకింగ్ చేసుకోవాలంటే రెండు లక్షల రూపాయలు బుకింగ్ ఫీజు చెల్లించాలి. 

 

అలా ఇప్పుడు బుక్ చేసుకున్న వారికీ ముందుగా ఈ వాహనం జులైలో లాంచ్ అయ్యి ఆగష్టు చివరి వారానికి ఆ వాహనం డెలివరీ చేస్తారు. ఇకపోతే ఈ వాహనం సరికొత్త మెర్సిడెజ్ బెంజ్ ఏ-క్లాస్ లిమోజైన్ సడెన్ మొదల్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.. అంతేకాదు.. ఈ కారులో వాహన ప్రియులను ఆకట్టుకునే 5 అద్భుత కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఈ వాహనంను ఆర్డర్ పెట్టేయండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: