కేంద్ర ప్రభుత్వం బంగారం లాంటి ఆఫర్ ఇచ్చింది. నేటి నుంచి ప్రారంభమై 15వరకు ఈ ఆఫర్ ఉంటుంది. ఇంతకీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ ఏమిటని అనుకుంటున్నారా..? అదేమిటంటే.. 2020 - 21 ఆర్థిక సంవత్సరంలో రెండో విడుత గోల్డ్ బాండ్లను ఈ రోజు నుంచి విక్రయించనున్నారు. మే 15వ తేదీ వరకు గోల్డ్బాండ్లు కొనుక్కునే అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇక గ్రాము బంగారం ధర రూ. 4,590గా నిర్ణయించారు. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.. డిజిటల్ చెల్లింపుల ద్వారా బంగారం కొన్నవారికి ఏకగా రూ.50 రాయితీ లభిస్తుందని ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వం తరపున ఈ బాండ్లను జారీ చేస్తుంది. కరోనా వైరస్ సృష్టించిన విపత్కర పరిస్థితుల్లోనూ ప్రస్తుతం బంగారానికి విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. అంతేగాకుండా.. కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ కారణంగా బయట బంగారం దుకాణాలు మొత్తం మూసి ఉన్నాయి. దీంతో పెద్ద ఎత్తన గోల్డ్బాండ్లకు ఆదరణ లభిస్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి ఏమేరకు కేంద్రం ఆశలు ఫలిస్తాయో చూడాలి మరి.