దేశం మొత్తం సురక్షితంగా ఉండటానికి తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మైనస్ డిగ్రీల మంచులో , శరీరాన్ని తినేసే చలిలో సైనికులు దేశ సరిహద్దుల్లో గస్తీ కాస్తున్నారు. వారికి దేశమే కుటుంబం. సొంత కుటుంబాన్ని విడిచి మంచు తుఫానులు సైతం లెక్క చేయకుండా తమ విధి నిర్వహణలో నిమగ్నమై ఉంటారు.

 

ఇప్పుడు సరిగ్గా అలాంటి దృశ్యాన్ని మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ తన ట్విట్టర్ ఖాతాలో సైనికుల గురించి ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో చంపేసే చలి లో సైనికులు విధి నిర్వహణలో ఉండగా తన పుట్టిన రోజు  పురస్కరించుకుని మంచునే కేక్ గా మార్చుకుని దానిని కట్ చేసి ఎంతో అందంగా నవ్వుతూ ఆనందంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ వీడియో ను తన ఖాతాలో పోస్ట్ చేశారు. తమ త్యాగాలకు అంత లేదు అంటే వీడియో తో పాటు తన దేశ భక్తిని చాటుకుంటూ రాశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: