ఎన్నికలు దగ్గర పడే కొద్ది తమిళనాడు లో రాజకీయాలలో వేడి పెరుగుతుంది. తాజాగా కమల్ హాసన్ పార్టీ యొక్క ట్రెజరర్ చంద్ర శేఖరన్ ఇంట్లో ఐటీ అధికారులు 11 కోట్ల నగదు ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో కమల్ హాసన్ కు ఎన్నికల వేళ పెద్ద ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి. అయితే గత మూడు రోజులుగా చంద్ర శేఖరన్ ఇంట్లోనూ, అలాగే కార్యాలయంలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు సోదాల్లో 11 కోట్లు చేసుకోగా..ఇంకా నగదు దొరికే అవకాశం ఉందని సమాచారం. మరి పార్టీ అధినేత ఇంట్లో కూడా దాడి జరిగే అవకాశం కూడా ఉందని తమిళ్ మీడియా లో వార్తలు వస్తున్నాయి. ఇక తమిళ నాడు లో మొదటి నుండి కూడా ఈ డబ్బు రాజకీయాలు జరుగుతూనే ఉన్న నేపథ్యంలో ఎన్నికల వేళ ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు నాయకులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మరికొందరి ప్రముఖుల ఇళ్ళలో కూడా ఐటీ సోదాలు నిర్వహించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: