తెలంగాణలో కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతుంది. ఇప్పటికే వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా సి‌ఎం కే‌సి‌ఆర్ కుమార్తె ఎం‌ఎల్‌సి అయిన కల్వకుంట్ల కవిత భర్త కరోనా బారిన పడ్డాడు.. ఈ విషయాన్ని స్వయంగా కవిత తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. " తన భర్తకు కరోనా సోకిందని, ప్రస్తుతం కుటుంబం అంతా హోమ్ క్వారెంటైన్ లో ఉన్నామని ఆమె తెలిపారు. 

అంతే కాగా తమను కలిసేందుకు వీలు పడదని ఎందుకంటే ఆఫీస్ మూసివేశామని ఆమె పేర్కొన్నారు. ఎవరు కూడా అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కవిత రాసుకొచ్చారు. క్వారెంటైన్ రోజులు ముగిసిన తరువాత మళ్ళీ ఆఫీస్ ఓపెన్ చేసేందుకు రీ షెడ్యూల్ చేస్తామని ట్విట్టర్ లో ఆమె తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో కేసుల సంఖ్య పెరుగుతున్న కారణంగా విద్యాసంస్థలు కూడా మూసివేసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: