కరోనా వైరస్ మహమ్మారి కారణంగా కేంద్రం అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. కరోనా సెకండ్‌ వేవ్‌ దేశాన్ని కుదిపేస్తున్న వేళ మరోసారి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని మరోసారి పొడిగించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ నిషేధాన్ని మే 31వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు డీజీసీఏ జాయింట్‌ డైరెక్టర్‌ జనరల్‌ సునీల్‌కుమార్‌ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: