ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు అట్లీ తన తదుపరి చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తో రూపొందించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈ నెల చివర్లో ముంబైలో ప్రారంభమవుతుందని సమాచారం. ఆగస్టు నెలాఖరులో ముంబైలోనే సినిమా షూటింగ్ ప్రారంభించాలని దర్శకుడు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మెగా బడ్జెట్ చిత్రాన్ని ఆగస్టు 15న ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ అలాంటి ప్రకటన ఏం రాలేదు. మరి ఈ సినిమాను ఇంకా అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారు ? అనే విషయం పై సస్పెన్స్ నెలకొంది. ఈ చిత్రంలో షారుక్ సరసన నయనతార నటించనుందని, షారుక్ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తాడని అంటున్నారు.

తాజా అప్డేట్ ఏమిటంటే... షారుక్ ఖాన్, అట్లీ కాంబినేషన్లో రానున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ పాన్ ఇండియా మూవీగా రూపొందనుందని, దాని కోసం ఏకంగా 200 కోట్ల బడ్జెట్ కేటాయించారని తెలుస్తోంది. భారీ స్థాయిలో నిర్మించబడుతున్న ఈ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా చేస్తున్నారట. ఈ సినిమాకు సంబంధించిన ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ అక్టోబర్ చివర్లో అధికారికంగా ప్రారంభం కానుందట. దీన్ని ముంబైలో చేస్తారని అంటున్నారు. ఇక సినిమాపై అధికారిక ప్రకటన రావడమే తరువాయి. ఈ సినిమాపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: