ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జగన్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో మరిన్ని సడలింపులు అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తాజా సడలింపుల్లో భాగంగా వస్త్రాల దుకాణాలకు, చెప్పుల దుకాణాలకు అనుమతి ఇచ్చింది. స్ట్రీట్ ఫుడ్స్ కు కూడా అనుమతి ఇచ్చింది. అయితే స్ట్రీట్ ఫుడ్స్ కేవలం పార్సిల్ సర్వీస్ మాత్రమే అందించాలని షరతులు విధించింది. రాష్ట్రంలో పెద్ద షోరూంలకు వెళ్లాలంటే ఆన్ లైన్ లో అనుమతులు తీసుకోవాలని తెలిపింది. 
 
ఇక అన్ని షాపుల్లో ట్రయల్ రూమ్స్ కు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. పానీపూరి బండ్లపై మాత్రం ఆంక్షలు కొనసాగనున్నాయి. నాలుగో విడత సడలింపుల్లో భాగంగా ఇప్పటికే వ్యాపార, వాణిజ్య సంస్థలకు నిబంధనలు సడలించిన ప్రభుత్వం తాజాగా మరిన్ని సడలింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్రం ఆదేశాలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం సడలింపుల విషయంలో నిర్ణయాలు తీసుకుంటోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: