విజయవాడ ఎంపీ కేశినేని నాని త్వరలో తన సన్నిహిత నేతలతో సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న సన్నిహిత నేతలు ఇప్పటికే ఆయన ఫోన్ చేసి మాట్లాడాలని త్వరలోనే వారందరితో కూడా ఆయన సమావేశమై ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇటీవల తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది లేదని మరో అభ్యర్థిని చూసుకోవాలని చంద్రబాబు నాయుడుకి కేశినేని నాని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల నాయకులు కేసినేని నాని తో సమావేశమై పార్టీలో కీలకంగా మరోసారి ఆయన వ్యవహరించే విధంగా అలాగే వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా మరోసారి పోటీ చేసే విధంగా ముందుకు వెళ్లాలని సూచించారు. అయితే ఆయన మాత్రం ఇప్పుడు పార్టీల నాయకులతో మరోసారి సమావేశం నిర్వహించి త్వరలో సంచలన నిర్ణయాలు కూడా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp