డ్రగ్స్ పై ప్రత్యేక నిఘా ఉంచడమే కాకుండా డ్రగ్స్ మూలాలు లేకుండా చేస్తామంటున్నారు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి. నూతన సంవత్సర వేడుకల రోజున వేడుకలు పోలీస్ నిబంధనలు అనుగుణంగా జరుపుకోవాలని.. పబ్బులు ఫామ్ హౌస్ లపై అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచుతామని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి అన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కీలకమైన సంస్థలు ఉన్నాయన్న సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి.. నిష్పక్షపాతంగా ప్రజలకు సేవ చేయడంతో పాటు చట్టబద్ధంగా పని చేస్తామన్నారు.

తమ వద్ద ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ పూర్తి భద్రత,రక్షణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని.. అతిపెద్ద సమస్యగా మారిన సైబర్ క్రైమ్స్ పై  ప్రత్యేక దృష్టి పెడతామని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి భరోసా ఇచ్చారు. అన్ని రకాల కేసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తామని.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూస్తామని.. ఇందుకు కొత్తగా ప్రణాళికలు సిద్ధం చేస్తామని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు. ఇకపై రెగ్యులర్ క్రైమ్స్ పైనా దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: